పెళ్లిచూపులు డైరెక్టర్ తరుణ్ భాస్కర్.. అమీతుమీ హీరోయిన్ ఇషా రెబ్బా సినిమాల్లోనే కాదు.. నిజ జీవితంలోనూ ఒకటి కానున్నారా? వీరి ప్రేమ పెండ్లి దాకా వెళ్లనుందా? అవుననే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు.
గోల్డెన్ చీరలో ఇషా రెబ్బా, పట్టు పంచెలో తరుణ్ భాస్కర్ ఆ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తరుణ్ భాస్కర్ తన తల్లిని కూడా తీసుకొని ఆ దేవుడి దర్శనం చేసుకున్నారు. ఈ ముగ్గురు కలిపి గుడి బయటకు కలిసి వచ్చారు. ఆ తర్వాత సెల్ఫీలతో అభిమానులు కూడా సందడి చేశారు. దీంతో అందరిలో ఊహగానాలు మొదలయ్యాయి.

తరుణ్ భాస్కర్, ఇషా రెబ్బా కలిసి జయజయజయహే అనే మలయాళ సినిమా రీమేక్లో కలిసి జంటగా కనిపించబోతున్నారు. ఈ సినిమా సంవత్సరం క్రితమే షూటింగ్ మొదలైంది. ఈ సినిమా నుంచి వీరి ప్రేమ మొదలైనట్టుగా ఊహగానాలు మొదలయ్యాయి. షూటింగ్లో కలువడమే కాదు.. తరుచుగా కూడా వీళ్లు కలిసేవారు. ఆ తర్వాత కాలం నుంచి ఇద్దరూ సహజీవనం కూడా చేస్తున్నట్లు వార్తలు గుప్పుమన్నాయి. కాకపోతే ఇప్పటి వరకు వీరు అధికారంగా ఏమీ ప్రకటించలేదు.
ఈ డైరెక్టర్ కమ్ హీరో అయిన తరుణ్ భాస్కర్కి ఇంతకుమునుపే పెండ్లి అయింది. కాకపోతే మనస్పర్థల కారణంగా కొంతకాలంగా భార్యకు దూరమయ్యాడు ఈ డైరెక్టర్. ఆ తర్వాత చాలా సినిమాల్లో క్యారెక్టర్ చేస్తున్నాడు. ఇక ఇషారెబ్బాకి ఇప్పటివరకు పెండ్లి కాలేదు. అడపదడపా సినిమాల్లో కనిపిస్తూనే ఉన్నదీ అమ్మడు. మరి వీరి ప్రేమ పెండ్లిదాకా వెళుతుందో లేదో ఇంకా వేచి చూడాల్సిందే!
తరుణ్భాస్కర్ డైరెక్టర్ కీడాకోలా సినిమాని దర్శకత్వం వహించి, నటించాడు. సంవత్సర కాలంగా ఇప్పటిరకు ఏ సినిమా ప్రకటించలేదు. కానీ విజయ్ దేవరకొండతో గానీ, రానాతో గానీ సినిమా చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇక ఇషారెబ్బా కెరీర్లో పెద్ద హిట్స్ లేకపోయినా మంచి నటిగా మాత్రం గుర్తింపు తెచ్చుకుంది. వీరిద్దరూ నటించిన ఆ సినిమా ఇంకా విడుదలకు సిద్ధం కాబోతున్నది.