డబ్బుకు ఉన్న విలువ తెలుసు. కానీ ఆ డబ్బుల మీద వెనుక ఉన్న వివిధ స్నారక చిహ్నాల గురించి తెలుసుకోవాలని ఎప్పుడైనా అనుకున్నారా? భోపాల్కి చెందిన ఒక వ్యక్తి అనుకున్నాడు.
భారతదేశంలో ఉన్నవాళ్లు ఒక క్షణం ఆగండి. మీ వాలెట్లో ఎన్నో కొన్ని నోట్లు ఉన్నాయా? వాటిని ఒక్కసారి వెనక్కి తిప్పి చూడండి. వింత కట్టడాలు మిమ్మల్ని అబ్బురపరుస్తాయి. అయితే వాటి వెనుక ఉన్న కథ తెలుసుకోవాలని ఒక ట్విట్టర్ ఔత్సాహికుడు ప్రయత్నించాడు. ఆయా ప్రాంతాలకు వెళ్లి మరీ తన నోటును సరి చూసుకున్నాడు. భారతీయ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబించే ఆ కట్టడాల గురించి తెలుసుకోండి.

10 రూపాయల నోటు..
ఆసియాలోని అత్యంత ప్రసిద్ధ ఆలయాలలో ఒకటి ఒడిశాలోని కోణార్క్ ఆలయం. దీని పేరు కోన (మూల), అర్కా (సూర్యుడు) అనే రెండు పదాల నుంచి వచ్చింది. సూర్యుడిని ఆరాధించే ప్రధాన ఆలయం. 1250 లో నిర్మించిన అసలు ఆలయం శిథిలావస్థకు చేరుకుంది. కానీ ఆ శిథిలాలు ఇప్పటికీ ఆ కాలం గుర్తులను అలాగే ఉంచాయి. 227 అడుగుల ఎత్తైన ముఖభాగంతో కూడిన ఎత్తైన పవిత్ర విగ్రహాలను కోణార్క్లో చూడవచ్చు.

20 రూపాయల నోటు..
ఎల్లోరాలోని కైలాస మందిరానికి ఎంతో చరిత్ర ఉంది. కొండ చరియలలోకి కందకాలను తవ్వి ఈ ఆలయాన్ని నిర్మించారు. క్రీ.శ. 760లో, రాజు కృష్ణ I మౌంట్ కైలాసను పోలి ఉండే నిర్మాణాన్ని నిర్మించాలని తన సైన్యాన్ని ఆదేశించాడట.సుత్తి, ఉలితో 2,00,000 టన్నుల రాతిని తొలగించడానికి ప్రయత్నిస్తున్న కార్మికుల సైన్యాన్ని ఒక్కసారి ఊహించుకోండి. వారి కష్టం ఈ ఆలయాన్ని చూస్తే అర్థమవుతుంది. నేడు ఆలయ వైభవం ఏథెన్స్లోని పార్థినాన్ కంటే రెండింతలు ఉంది. ఆలయం మీద వివిధ ఇతిహాసాలను చూడొచ్చు. అంతేకాదు.. విష్ణువు అవతారాలను చూడడం మాత్రం మిస్ కావద్దు.

50 రూపాయల నోటు..
హంపి రాతి రథం గురించి ఒక ఆసక్తికరమైన కథ ఉంది. 16వ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్యాన్ని పాలించిన రాజు కృష్ణదేవరాయలు. ఆయన ఒడిశాలో యుద్ధంలో ఉన్నప్పుడు, అతని దృష్టి కోణార్క్ సూర్య దేవాలయ రథంపై పడింది. కర్ణాటకలో దాని ప్రతిరూపాన్ని నిర్మించాలని నిర్ణయించుకున్నాడు. అలా హంపి రాతి రథం సాంప్రదాయ అధునాతనతను కలిగి ఉంది. ఇది భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధ రాతి రథాల త్రయంలో ఒకటిగా నిలిచింది. మూడవది తమిళనాడులోని మహాబలిపురంలో ఉంది. రథం దాని స్థానం నుండి కదిలిన రోజు ప్రపంచం ఆగిపోతుందని నమ్మే స్థానికులలో ఈ వారసత్వ అద్భుతం గొప్ప ప్రాముఖ్యతను కలిగి ఉంది.

100 రూపాయల నోటు..
ఈ మెట్ల బావిని సందర్శించిన ఎవరైనా దాని అందం చూసి ముగ్ధులు అవ్వాల్సిందే! గుజరాత్లోని సరస్వతి నది ఒడ్డున చెక్కబడిన స్తంభాలు, 800 కంటే ఎక్కువ శిల్పాలను ఇక్కడ చూడొచ్చు. నిర్మాణాన్ని నిశితంగా పరిశీలిస్తే దాని తలక్రిందులుగా ఉన్న ఆలయ రూపకల్పన తెలుస్తుంది. ఈ చౌలుక్య రాజవంశానికి చెందిన రాణి ఉదయమతికి చెందుతుంది. ఆమె ఆధ్వర్యంలో 1063లో ఆమె భర్త భీమ్దేవ్ I జ్ఞాపకార్థం ఈ మెట్ల బావి నిర్మించబడింది. కానీ కాలక్రమంలో అది బురదతో నిండిపోయింది. 1890లో దీనిని సందర్శించిన ఇద్దరు పురావస్తు శాస్త్రవేత్తలు హెన్రీ కౌసెన్స్, జేమ్స్ బర్గెస్ దానిని వెలికితీసేశారు. ఆ తర్వాత ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా 1980లలో దీనిని పునరుద్ధరించింది. 2014 నుండి ఇది యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించడం జరిగింది.

200 రూపాయల నోటు..
క్రీస్తుపూర్వం మూడవ శతాబ్దంలో మధ్యప్రదేశ్లో సాంచి స్థూప నిర్మాణం జరిగింది. అర్ధగోళాకార గోపురం చుట్టూ ఒక రెయిలింగ్, నాలుగు ద్వారాలు ఉంటాయి. ఇవి బుద్ధుని జీవితం నుంచి ప్రేరణ పొంది ఇక్కడి శిల్పాలను రూపొందించారు. అశోక చక్రవర్తి నిర్మించిన స్థూపం అందంగా ఉంటుంది. ఈ స్తంభం కూడా ఇక్కడ సందర్శించదగినది. దాని పై భాగంలోని నాలుగు సింహాలు ఒకదానికొకటి వెనుకకు నిలబడి ఉంటాయి. ఇది భారతదేశ జాతీయ చిహ్నంగా పరిగణనలో ఉంది.
500 రూపాయల నోటు..

ఎర్రకోట చారిత్రక ముద్ర భారతదేశ సహస్రాబ్దాలుగా విస్తరించి ఉంది. ప్రతి స్వాతంత్య్ర, గణతంత్ర దినోత్సవాలలో జాతీయ జెండాను దాని ప్రాకారాల పైన ఎగురవేస్తారు. ఇంకో విషయం.. ఎర్రకోట ఎల్లప్పుడూ ఎరుపు రంగులో ఉండదు. ఇది మొదట తెల్లగా ఉండేది. కానీ తెల్లటి రాయి రంగు మారుతుండడంతో బ్రిటిష్ వారు దానికి ఎరుపు రంగు వేయించారని ఒక సరదా వాస్తవం ప్రచారంలో ఉంది. ఎర్ర ఇసుక రాయితో కోట లోపల ప్రజా ప్రేక్షకుల హాల్ (దివాన్-ఇ-`ఆమ్) ఉంది. ఇది చదునైన పైకప్పుతో, 60 ఎర్ర ఇసుకరాయి స్తంభాలతో నిర్మితమైంది. చిన్న ప్రైవేట్ ప్రేక్షకుల హాల్ (దివాన్-ఇ-ఖాస్) తెల్ల పాలరాయితో నిర్మించారు.

2000 రూపాయల నోటు..
భారతీయ రిజర్వ్ బ్యాంకు రూ. 2,000 నోటును ప్రవేశపెట్టినప్పుడు అందరికీ ఆసక్తిని కలిగించింది. ఇది ఒక అంతరిక్ష నౌక. మంగళయాన్, ఇస్రో (భారత అంతరిక్ష పరిశోధన సంస్థ) అంగారక గ్రహానికి వెళ్లిన మొదటి అంతరిక్ష నౌక. అంగారకగ్రహాన్ని అధ్యయనం చేయాలనే ఆలోచనతో నిర్మించబడిన మంగళయాన్ అంతరిక్ష నౌక సెప్టెంబర్ 23, 2014న అంగారక కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశించింది. యునైటెడ్ స్టేట్స్, సోవియట్ యూనియన్, న్యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ESA) తర్వాత దీనిని సాధించిన నాల్గవ అంతరిక్ష సంస్థగా ఇస్రో నిలిచింది.