తెలంగాణ స్పెష‌ల్‌.. అమ్మ‌మ్మల కాలం నాటి స‌ర్వ‌పిండి

కావాల్సిన ప‌దార్థాలు :
బియ్యం పిండి: రెండు క‌ప్పులు
ఉల్లిపాయ‌లు : నాలుగు
వెల్లులి : ప‌ది రెబ్బ‌లు
జీల‌క‌ర్ర : ఒక టీస్పూన్
క‌రివేపాకు : రెండు రెమ్మ‌లు
నువ్వులు :మూడు టీస్పూన్స్‌
శ‌న‌గ ప‌ప్పు : మూడు టీస్పూన్స్‌
ప‌చ్చిమిర్చి: నాలుగు
ఉప్పు: స‌రిప‌డినంత‌
నూనె : స‌రిప‌డినంత‌
నీళ్లు: స‌రిప‌డిన‌న్ని

త‌యారీ విధానం:

స్టెప్1: ఉల్లిపాయ‌లు స‌న్న‌గా క‌ట్ చేసి పెట్టుకోవాలి. ప‌చ్చిమిర్చి, వెల్లులి, జీల‌క‌ర్ర వేసి మిక్సీ ప‌ట్టుకోవాలి.
స్టెప్2: ఒక పెద్ద గిన్నెలో బియ్యం పిండి తీసుకొని అందులో క‌ట్ చేసుకున్న ఉల్లిపాయ‌లు, మిక్సీ ప‌ట్టుకున్న ప‌చ్చిమిర్చి మిశ్ర‌మం, నువ్వులు, శ‌న‌గ ప‌ప్పు, ఉప్పు వేసి ఒకసారి క‌లిపి ఇప్పుడు నీళ్లు పోసి చ‌పాతీ పిండిలా క‌లుపుకోవాలి.
స్టెప్ 3:
ఇప్పుడు ఒక వెడ‌ల్పాటి గిన్నె తీసుకొని దానికి కొంచెం నూనె రాసి ఇందాక క‌లిపిన‌ పిండిని తీసుకొని గిన్నెకి కాస్త ప‌లుచ‌గా ఒత్తుకోవాలి.
స్టెప్4: ఇప్పుడు స్టౌ ఆన్ చేసి ఇందాక పిండి ఒత్తుకున్న గిన్నెని పెట్టి స‌న్న‌ని మంట పై బాగా కాల్చుకోవాలి. ఇది నాలుగైదు రోజులు అయినా పాడ‌వ‌కుండా ఉంటుంది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Powered by WordPress