కావాల్సిన పదార్థాలు :
మునగాకు : 100 గ్రా.
పెసర పప్పు : 200 గ్రా.
పచ్చిమిరపకాయలు : 10
చింత పండుః నిమ్మకాయ అంత
టమాటలు : 2
పసుపు : పావు టీస్పూన్
జీలకర్ర : అర టీస్పూన్
ఆవాలు : అర టీస్పూన్
ఎండు మిర్చి : 2
కారం : ఒక టీస్పూన్
కరివేపాకు : 2 రెమ్మలు
వెల్లులి : 10 రెబ్బలు
నూనె, ఉప్పు: సరిపడినంత
తయారీ విధానం:
స్టెప్ 1: మునగాకు శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. టమాటలు, పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకోవాలి. చింతపండు నానబెట్టుకోవాలి.
స్టెప్ 2: కుక్కర్లో కడిగి పెట్టుకున్న మునగాకు, పెసర పప్పు వేసుకోవాలి. అందులోనే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, టమాట ముక్కలు వేసుకొని మూత పెట్టుకొని 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి.
స్టెప్ 3: ఇప్పుడు కుక్కర్ మూత తీసి చింతపండు రసం, కారం, ఉప్పు వేసుకొని కలిపి పక్కన పెట్టుకోవాలి.
స్టెప్ 4: ఒక కడాయి పెట్టుకొని నూనె వేసుకొని జీలకర్ర, ఆవాలు, ఎండు మిర్చి, వెల్లులి, కరివేపాకు వేసుకొని పోపు పెట్టాలి.
స్టెప్ 5: ఈ పోపు పప్పులో వేసుకొని సన్నని మంట మీద ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి. రుచితో పాటు.. కాల్షియం, విటమిన్ బి, సి ఉండే పప్పు మీ ముందుంటుంది.