కావాల్సిన పదార్థాలు:
చేపలు: 500 గ్రా.
చింతపండు : ఒక పెద్ద నిమ్మకాయంత
జీలకర్ర : అర టీ స్పూన్
ఉల్లిపాయలు : 2 (పెద్దవి)
ఎల్లిపాయలు : 10
పసుపు : అర టీ స్పూన్
కారం : 2టీ స్పూన్స్
జీలకర్ర మెంతుల పోడి : ఒక టీ స్పూన్
అల్లం, వెల్లులి పేస్ట్ : అర టీ స్పూన్
ధనియాల పోడి : అర టీ స్పూన్కో
కొత్తిమీర : ఒక కట్ట
కరివేపాకు : 2 రెమ్మలు
నూనె, ఉప్పుః తగినంత
తయారీ విధానం:
స్టెప్ 1: ముందుగా చేపలు శుభ్రంగా కడిగి అందులో కొద్దిగా ఉప్పు, నూనె వేసి కలిపి 5 నిమిషాలు ఉంచి మళ్లీ కడుగాలి.
స్టెప్ 2 : ఉల్లిగడ్డను చిన్నగా కట్ చేసుకోవాలి. చింతపండు పులుసు తీసి పెట్టుకోవాలి.
స్టెప్ 3: ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని నూనె వేసుకొని కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. వీటిని కాస్త చల్లారనివ్వాలి.
స్టెప్ 4: చల్లారిన తర్వాత వీటిని మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి.
స్టెప్ 5: మళ్లీ గిన్నెలో తగినంత నూనె పోసుకొని జీలకర్ర, ఉల్లిగడ్డ వేసి లైట్ గోల్డ్ కలర్ వచ్చేవరకు వేయించాలి. ఇందులో కరివేపాకు, అల్లం వెల్లులి పేస్ట్, పసుపు వేసుకోవాలి.
స్టెప్ 6: ఇప్పుడు ఉల్లిపాయ పేస్ట్ వేసి బాగా కలపాలి. ఐదు నిమిషాలు కలిపిన తర్వాత ఇందులో చేప ముక్కలు వేసి మరో ఐదు నిమిషాలు ఉంచాలి.
స్టెప్ 7: ఇప్పుడు చింతపండు పులుసు పోసి, జీలకర్ర మెంతుల పొడి, ధనియాల పొడి, కొత్తిమీర వేసి మూత పెట్టాలి.
స్టెప్ 8 : ఒక పది నిమిషాలు సన్నని మంట మీద ఉడకనివ్వాలి. అంతే ఎంతో రుచికరమైన చేపల పులుసు రెడీ!