పాలరాతి కట్టడం అనగానే అందరికీ గుర్తుకు వచ్చేది తాజ్మహల్. కానీ మన దేశంలో ఇంకొన్ని కట్టడాలు కూడా మిమ్మల్ని కట్టిపడేస్తాయి. అలాంటి పాలరాతి కట్టడాల గురించే ఈ కథనం..
తాజ్మహల్ అనగానే అందరికీ గుర్తుకు వచ్చేది ప్రేమకు చిహ్నం అని. ముంతాజ్ ప్రేమకు ఆ తెల్లని పాలరాతి కట్టడం ఎలాగైతే ఉందో.. మన దేశం నలుమూలలా అలాంటి జ్ఞాపకార్థం కట్టించిన కట్టడాలు, ఆలయాలు ఉన్నాయి. వాటి గురించి తెలుసుకోకపోతే ఎలా?!

విక్టోరియా మెమోరియల్
ఈ కట్టడం కలకత్తాలో ఉంది. దీన్ని సర్ విలియమ్ ఎమర్సన్ డిజైన్ చేశారు. బ్రిటీష్, మొఘల్ నిర్మాణ శైలులను మిళితం చేసి ఈ పాలరాతి నిర్మాణాన్నిచేపట్టారు. క్వీన్ విక్టోరియా జ్ఞాపకార్థం బ్రిటీస్ రాజ దీన్ని కట్టించారు. ఈ మ్యూజియం 64 ఎకరాలతో చుట్టూ తోటలు, సుందరంగా ఉండే ఈ కట్టడంలో ఆ కాలం నాటి కళాఖండాలు, పత్రాలను సేకరించి భద్రంగా దాచి పెట్టారు.

లోటస్ టెంపుల్
ఢిల్లీలో ఉన్న ఈ టెంపుల్ని ఇరానియన్ ఆర్కిటెక్ట్ ఫరీబోర్జ్ సాహ్బ డిజైన్ చేశారు. స్వచ్ఛత, శాంతికి చిహ్నాంగా దీన్ని కట్టించారు. 1986లో ఈ కట్టడం పూర్తయింది. దీన్ని స్పెషాలిటీ ఏంటంటే.. తొమ్మిది వైపులా 27 మార్బుల్స్ను కమలం పూల రేకుల్లో అమర్చారు. అన్ని మతాల వారికి దీంట్లో ప్రవేశం ఉంది. ఈ కట్టడం ఎన్నో ఆర్కిటెక్చరల్ అవార్డులను గెలుచుకున్నది.

దిల్వారా ఆలయాలు
రాజస్తాన్లోని మౌంటు అబు ప్రాంతంలో ఈ ఆలయాలు నిర్మితమై ఉన్నాయి. ఐదు జైన మందిరాలను ఒక చోట చూడచక్కని శిల్ప సంపదతో కట్టారు. 11 నుంచి 13 శతాబ్దంలో వివిధ తీర్థంకరులకు అంకితమిస్తూ ఈ ఆలయాలను నిర్మించారు. ఈ పాలరాతి ఆలయాలు చాలా ప్రశాంతతతో పాటు ఆనాటి చరిత్రను మన కళ్లముందు ఉంచుతాయి.

బిర్లామందిర్
ఈ పేరు వినగానే హైదరాబాద్లోని ఆలయమే గుర్తుకు వస్తుంది. కానీ జైపూర్లోని స్వామి నారాయణ టెంపుల్ని 1988లో జైపూర్లో నిర్మించారు. విష్ణు, లక్ష్మీదేవీలు కొలువై ఉన్న ఈ స్థలం అందరినీ ఆకర్షిస్తుంది. ఈ ఆలయం చుట్టూ ఉండే గార్డెన్స్ అందరినీ అబ్బురపరిచేలా ఉంటాయి.

జస్వంత్ తడ
ఇది కూడా రాజస్తాన్లో నిర్మితమైన కట్టడమే. కాకపోతే జోధ్పూర్లో ఉంది. రాజ్పుత్ల నిర్మాణశైలిని ఇక్కడ చూడొచ్చు. 1899లో మహరాజా సర్దార్ సింగ్ తన తండ్రి జ్ఞాపకార్థం దీనిని నిర్మించారు. చిన్న కొలను, గార్డెన్ చాలా బాగుంటుంది. అంతేకాదు.. ఈ భవనంలో చరిత్రకు సంబంధించిన చిత్రపటాలను, జోధ్పూర్ని పాలించిన రాజుల చిత్రాలను వీక్షించొచ్చు.

మోటి మసీద్
ఆగ్రాలోనే ఈ మసీద్ని చూడొచ్చు. మొగల్ సామ్రాజ్యాధినేత షాజహాన్ 1648 నుంచి 1654 సంవత్సరాల్లో ఈ నిర్మాణాన్ని చేశారు. ఇది ఆగ్రా ఫోర్ట్ దగ్గరే ఉంటుంది. ఈ తెల్లని పాలరాతి మసీద్ కేవలం భక్తి భావాన్నే కాదు.. ప్రశాంతతను ఇచ్చేలా దీని నిర్మాణం జరిగింది.

బీబీ కా మక్బారా
ఇది చూడడానికి తాజ్మహల్లాగే కనిపిస్తుంది. దీనిని తాజ్ ఆఫ్ ది దక్కన్గా కూడా పిలుస్తారు. మహారాష్ట్రలోని ఔరంగాబాద్లో 1678లో దీనిని అజాం షా తన భార్య దిల్రసు బాను బేగం జ్ఞాపకార్థం నిర్మించినాడు. ఈ డిజైన్ చూస్తే ఆయనకు తన భార్య మీద ఉన్న ప్రేమ అర్థమవుతుంది.