కావాల్సిన పదార్థాలు :
రాగి పిండి : 500 గ్రా.
నెయ్యి :100గ్రా.
బెల్లం : 500 గ్రా.
నీళ్లు : ఒక గ్లాస్
బాదం: ఒక టీస్పూన్
పిస్తా: ఒక టీస్పూన్
కిస్ మిస్: ఒక టీస్పూన్
తయారీ విధానం :
స్టెప్1 : స్టవ్ పై ఒక కడాయి పెట్టుకొని నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడి అయిన తర్వాత అందులో డ్రై ఫ్రూట్స్ వేయించుకొని పక్కకు తీసుకోవాలి.
స్టెప్2: ఇప్పుడు మిగిలిన నెయ్యిలో రాగి పిండి వేసి సన్నని మంటపై పచ్చి వాసన పోయే వరకు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి.
స్టెప్3 : ఇంకో గిన్నెలో బెల్లం వేసుకొని నీళ్లు పోసుకోని లేత పాకం రానివ్వాలి. ఇప్పుడు వేయించి పెట్టుకున్న రాగి పిండి, డ్రై ఫ్రూట్స్ వేసుకొని కలుపుకోవాలి.
స్టెప్4 : ఈ మిశ్రమం కొంచెం వేడిగా ఉన్నప్పుడే లడ్డులు చుట్టుకోవాలి. కొన్ని డ్రై ఫ్రూట్స్ని పైన అద్దితే మరింత టేస్టీగా ఉంటాయి. ఈ లడ్డులను గాజు చొరబడని డబ్బాలో ఉంచితే చాలా రోజులు నిల్వ ఉంటాయి.