శివరాత్రి పర్వదినం కేవలం భారతదేశంలోనే కాదు.. ప్రపంచం నలుమూలల ఉన్న భారతీయులంతా జరుపుకొంటారు. అమెరికాలో ఈ రోజున సందర్శించేందుకు ప్రశస్తమైన ఆ గుడి ఏంటో దాని వివరాలేంటో చదువండి..

సోమ పర్వతంపై తప్పక సందర్శించాల్సిన సోమేశ్వర ఆలయాన్ని అమెరికాలోని మౌంట్ కైలాష్ అని పిలుస్తారు. అమెరికాలో పశ్చిమ కైలాస పర్వతం ఉందని అమెరికాలో నివసిస్తున్న చాలా మంది భారతీయులకు తెలియదు. ఉత్తర కరోలినాలోని బ్లూ రిడ్జ్ పర్వతాలలో ఈ సోమేశ్వరుడు కొలువై ఉన్నాడు.
జ్యోతిర్లింగంగా..
ఈ గుడి పచ్చదనం మధ్య నిర్మితమైంది. ఇక్కడ ఉన్న శ్రీ సోమేశ్వర ఆలయం 448 ఎకరాల వైదిక సమాజం, విద్యా కేంద్రం, సాంస్కృతిక స్వర్గధామంగా విలసిల్లుతున్నది. మౌంట్ సోమ దృష్టి వేద సాంకేతికత, వాస్తు శాస్త్రం, ప్రకృతి సూత్రాలకు అనుగుణంగా జ్ఞానోదయ నగరంగా విరాజిల్లుతున్నది. ఇది భారతదేశం వెలుపల ఉన్న అత్యుత్తమమైన, అత్యంత అందమైన జ్యోతిర్లింగ మందిరాలలో ఒకటిగా పరిగణిస్తారు. భారతదేశం నుంచి దిగుమతి చేసుకున్న 46 టన్నుల గ్రానైట్ను చేతితో చెక్కారు. లింగం 20 అడుగుల ఎత్తైన హనుమంతుడి విగ్రహం సహా ఇతర దేవతలను సృష్టించారు. ముఖ్యంగా మంచు కురుస్తున్నప్పుడు, సుందరమైన కొండ ప్రకృతి దృశ్యం ఉత్తర కరోలినాలోని శ్రీ సోమేశ్వర ఆలయాన్ని ఉత్తరాఖండ్లోని గర్హ్వాల్ హిమాలయ శ్రేణిలోని కేదార్నాథ్ ఆలయంతో పోలుస్తుంటారు.
సందర్శన కోసం..

ఉత్తర కరోలినాలోని శ్రీ సోమేశ్వర ఆలయాన్ని సందర్శించడానికి చాలా దూరం ప్రయాణించే భక్తులకు రాత్రిపూట వసతి, భోజనం సదుపాయం ఉంది. కాటేజ్ లు, డార్మ్ గదులు సంవత్సరంలో 365 రోజులు అందుబాటులో ఉంటాయి. మౌంట్ సోమాలోని సందర్శకుల కేంద్రంలో వారాంతాల్లో, సెలవు దినాల్లో భారతీయ బఫే అందించే ఫలహారశాల ఉంది. వారపు రోజులలో భోజనం పెద్దలకు 12డాలర్లు, పిల్లలకు 6డాలర్లకు అందించబడుతుంది. భోజనం చేయాలనుకునే భక్తులు తమ సందర్శనకు ఒక రోజు ముందు 828-531-9925కు కాల్ చేయాలని సూచించారు. మౌత్ సోమాలోని సందర్శకుల కేంద్రంలో వేద వివాహాలు, వివిధ సామాజిక కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి.
గొప్ప వాస్తుశిల్పి..
సోమ పర్వతంపై ఉన్న శ్రీ సోమేశ్వర ఆలయం 2011లో స్థాపించబడినప్పటికీ, ఆలయ ఆలోచన 2006 నుంచే జరిగింది. డాక్టర్ మైఖేల్ మామాస్ ఈ ఆలయానికి అంకురార్పణ చేశారు. పురాతన హిందూ గ్రంథాలననుసరించి ఈ ఆలయ నిర్మాణం జరిగింది. తమిళనాడుకు చెందిన డాక్టర్ వైద్యనాథ గణపతి స్థపతి మార్గదర్శకత్వంలో, ఉత్తమ వాస్తుశిల్పులలో కొంతమంది అయిన సంతాన కృష్ణన్ స్థపతి, కృతిక కరుప్పయ్య, మైఖేల్ బోర్డెన్ కలిసి శ్రీ సోమేశ్వర ఆలయ రూపకల్పన చేశారు. కన్యాకుమారిలో ప్రఖ్యాత తమిళ కవి, సాధువు తిరువల్లూవర్ విగ్రహం, చెన్నైలోని ల్యాండ్మార్క్ స్మారక చిహ్నం వల్లువర్ కొట్టం, మేరీల్యాండ్లోని శ్రీ శివ విష్ణు ఆలయం, గ్రేటర్ చికాగోలోని శ్రీ గణేష్ శివ దుర్గ ఆలయాన్ని డాక్టర్ వైద్యానాథ గణపతి స్థపతి రూపొందించారు. 2009లో ఆయనకు పద్మభూషణ్ అవార్డు లభించింది. సోమ పర్వతంపై ఉన్న శివాలయం ప్రారంభించబడిన మూడు నెలల తర్వాత ఆయన తుది శ్వాస విడిచారు.
