రానా.. ఈ ఐకానిక్ టాలీవుడ్ హీరో రెజ్లింగ్ ఈవెంట్లో కనిపించాడు. వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్టైన్మెంట్లో పాల్గొన్న తొలి భారతీయ నటుడిగా చరిత్ర సృష్టించాడు.
‘బాహుబలి’ వంటి చిత్రాలలో తన శక్తివంతమైన పాత్రలకు పేరుగాంచిన రానా WWE ఈవెంట్లో మెరిశాడు. WWE వార్షిక ఈవెంట్ అయిన రెజిల్ మేనియా 41వ ఈవెంట్ ఇప్పుడు నెట్ ఫ్లిక్స్లో ప్రసారం అవుతున్నది. ఈ సంబురం లాస్ వేగాస్లో జరుగుతున్నది. చిన్నప్పటి నుంచి రెజ్లింగ్ అభిమాని అయిన రానా ఈ ఈవెంట్ని ప్రత్యక్షంగా చూడడం చాలా హ్యాపీగా ఉందని చెప్పారు. ఈ సందడితో పాటు.. ఆయన తన రానా నాయుడు సిరీస్ని ప్రమోట్ కూడా చేశారు.
ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది WWE అభిమానులకు ఇంక పండుగే. దాన్ని నెట్ఫ్లిక్స్లో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. దీనికి సంబంధించిన సమాచారం రానాతో పాటు, నెట్ఫ్లిక్స్ తన అకౌంట్లో ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ రెజిల్ మేనియాలో పాల్గొన తొలి భారతీయ సెలబ్రిటీగా రానా తన పేరును నమోదు చేసుకున్నాడు.
రానా దగ్గుబాటి.. “రెసిల్మేనియా 41లో ఉండటం ఒక సంతోషమైన అనుభవం. WWE మనందరి బాల్యంలో ఒక భాగం. ఇప్పుడు దానిని ప్రత్యక్షంగా ముందు వరుసలో కూర్చొని చూడడం, ప్రపంచ వేదికపై భారతదేశాన్ని ప్రాతినిధ్యం వహించగలగడం సంతోషంగా ఉంది. ముఖ్యంగా WWE, రానా నాయుడు రెండు కూడా నెట్ఫ్లిక్స్లో ప్రసారం కావడం నాలో ఆనందాన్ని రెట్టింపు చేస్తున్నదిష అంటూ తెలిపారు.
రానా దగ్గుబాటి రాబోయే క్రైమ్ డ్రామా ‘రానా నాయుడు సీజన్ 2’లో వెంకటేష్ దగ్గుబాటి, సుర్వీన్ చావ్లా కూడా నటించారు. ఈ షో 2025లో నెట్ఫ్లిక్స్లో విడుదల కానుంది. ఈ సిరీస్ మొదటి భాగం 10 మార్చి 2023న విడుదలైంది.