పురుషుల ఆధిప్యత ఉన్న రంగంలో మహిళలు రాణించడం కష్టం. అలాంటిది నాలుగు దశాబ్దాలకు పైగా పార్లమెంట్ న్యూస్ఫొటోగ్రాఫర్గా ఉన్నది షిప్రా దాస్. ఆమెను పార్లమెంట్ సమావేశంలో రాహుల్గాంధీ పిలిచి పలుకరించడంతో ఆమె గురించి అందరూ తెగ ఆరాలు తీస్తున్నారు. అందుకే ఆమె గురించే ఈ కథనం..
షిప్రా దాస్.. ఆలోచనల స్పష్టత ఆమె ఛాయాచిత్రాలలో ప్రతిబింబిస్తుంది. ఆమె ప్రసిద్ధ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, అప్పటి రాజకీయ కార్యకర్త మమతా బెనర్జీ లాగే పెండ్లి చేసుకోకుండా ఉంది. పైగా ఆమెతో కలిసి 1989 నుంచి 1991 వరకు వీరు ఢిల్లీలో కలిసి ఉన్నారు. షిప్రా వ్యవహారశైలి మమతా బెనర్జీకి చాలా దూకుడుగా ఉంటుంది.

ఆమె రాసిన పుస్తకం ది లైట్ వితిన్: ఎ డిఫరెంట్ విజన్ ఆఫ్ లైఫ్ – 2013లో రాష్ట్రపతి భవన్లో అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీచే ఆవిష్కరించబడింది. ఆమె చిత్రాలను చూసి ముగ్ధులైన వారిలో ఎల్ కె అద్వానీ ఒకరు. ఆయన 2013లో తన బ్లాగులో “నేను గతంలో చాలా పుస్తక విడుదల కార్యక్రమాలకు హాజరయ్యాను. కానీ ఈ రోజు పాల్గొన్నది నిజంగా మరపురానిది అంటూ రాసుకొచ్చారు. ప్రముఖ గీత రచయిత గుల్జార్ ఆమె గురించి షిప్రా దాస్ తన కెమెరాలోని లెన్స్ల స్థానంలో హృదయాన్ని కలిగి ఉన్నారు. వేళ్లతో ముఖాలను చూసే, అనుభూతి చెందే వారికి, వారి హృదయాలతో చూడటానికి అంతర్గత లెన్స్ ఉంటుంది అంటూ ఆ సమయంలో చెప్పారు. నిజంగా ఆమె ఫొటోలను చూస్తే అర్థమవుతుంది.
ఢిల్లీలో రాజకీయ సంఘటనలకు దగ్గరి సాక్షిగా ఉంది మొదటి సాక్షిగా ఉంది షిప్రా. ఆమె రాజధాని రాజకీయ దృశ్యంలో కొన్ని ఐకానిక్ చిత్రాలను తీశారు. ఆమె PTI, టెలిగ్రాఫ్, ఇండియా టుడే వంటి ప్రముఖ ప్రచురణలకు పనిచేసింది. దానికి ఆమెకు అనేక అవార్డులు వచ్చాయి. 2023లో భారత ప్రభుత్వం జాతీయ ఫొటోగ్రఫీ అవార్డుల్లో.. లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అందుకుంది.
కష్టపడేతత్వం..
ఆమె కోల్కత్తాలో పెరిగింది. ఆరుగురు తోబుట్టువులలో ఆమె పెద్దది. 8వ తరగతి నుంచే కుటుంబానికి అండగా నిలబడింది. రోజుకు 14-15గంటలు కష్టపడి పని చేసి ఇంటికి డబ్బులు పంపేది. అలా పనిచేస్తూనే చదువు కొనసాగించింది. ఆ సమయంలో తనే ఇంటికి ఆధారం అవ్వడం వల్ల పెండ్లి గురించి కూడా ఆమె ఆలోచించలేదు. అదే సమయంలో ఆమె AIRకి సౌండ్ ఎడిటర్గా పనిచేయడం ప్రారంభించింది.ఎపిసోడ్కు రూ.5 చెల్లించే అనేక టాక్ ప్రోగ్రామ్లను చేసింది, కొన్ని ప్రచురణలకు ప్రూఫ్ రీడింగ్ కూడా చేసింది. ఆమె వార్తల ఫీచర్ల కోసం చిత్రాల అవసరం ఉండేది. దానికోసం ఫొటోగ్రాఫర్లను అభ్యర్థించేది. వారు సమయానికి రాకపోవడం వల్ల తానే స్వయంగా తీయాలని నిర్ణయించుకుంది.

వాయిదాల పద్ధతిలో..
షిఫ్రా స్నేహితుడు సంజీవ్ ఆమెకు ఐసోలీ-II కెమెరాతో కొన్ని గంటలు పాఠం నేర్పించాడు. ఆమె గంగా సాగర్ మేళాను కవర్ చేసింది. చిత్రాలు అద్భుతంగా వచ్చాయి. దాంతో ఫోటో జర్నలిస్ట్ కావాలనే ఆశయం ఆమె జీవితానికి కొత్త దిశానిర్దేశం చేసింది. సంజీవ్ సెకండ్ హ్యాండ్ SLR కెమెరా వాయిదాల పద్ధతిలో షిఫ్రాన్కి ఇప్పించాడు. అలా ఆమె దాంతో ప్రాక్టీస్ చేస్తూ వచ్చింది. ఆమె మొదటగా స్థానిక జూలో పనిచేసింది. ఆ తర్వాత న్యూస్ ఫొటోగ్రఫీలోకి అడుగు పెట్టాలనుకుంది. ఆనంద్ బజార్ పత్రిక ద్వారా ఆమెకు ఆఫర్ కూడా వచ్చింది. కానీ పురుష ఫొటోగ్రాఫర్లు ఆమెకు వ్యతిరేకంగా ముఠాగా ఏర్పాడ్డారు. దాంతో నియామక లేఖను అందుకున్న రోజునే రాజీనామా చేయాల్సి వచ్చింది.
సమయానికి..
షిఫ్రా ఉద్యోగం పోయిందని కుంగిపోలేదు. ప్రయత్నాలు ప్రారంభించింది. ఆమె PTIలో స్ట్రింగర్ ఫోటోగ్రాఫర్గా చేరింది. తీసిన ప్రతి షాట్కు రూ. 100 చెల్లించబడింది. ఆమె కృషికి తగిన ఫలితం దక్కింది. అలా నెలకు ఇతర ఫొటోగ్రాఫర్ల కంటే ఎక్కువ సంపాదించేది షిఫ్రా. దానికి కారణం.. ఆమె ఇతర ఫొటోగ్రాఫర్ల కంటే ముందే పిక్చర్ రోల్స్ను పంపించేది. పైగా ఆమె చిత్రాలు ప్రముఖ దినపత్రికల్లో ప్రచురితమయ్యేవి. అలా మహిళలు న్యూస్ ఫోటోగ్రాఫర్లు కాలేరనే నానుడిని ఆమె తిరగరాసింది. దాదాపుగా ఒక సిద్ధాంతంగా పరిగణించబడే అన్ని తప్పు భావనలను ఆమె ధిక్కరించింది. ఆమె తన కెమెరా ద్వారా అందంగా బంధించిన అనేక చారిత్రక సంఘటనలకు ఆమె సాక్షిగా ఉంది.
ప్రస్తుతం షిఫ్రా నోయిడాలో ఒంటరిగా నివసిస్తుంది. ఆమె ఇప్పటికీ ఫ్రీలాన్స్ అసైన్మెంట్స్ చేస్తుంది. ఇంకా ఆమె తన ఇన్నింగ్స్ ముగియలేదని చెబుతున్నది.