టేబుల్ క్లాత్ స్టైలిష్గా ఉండడమే కాదు.. ఎన్నిసార్లు ఉతికినా పాడవకూడదని భావించారా? ఇందిరా ప్రశాంత్ అనుకోవడమే కాదు.. సరికొత్త లెనిన్ బ్రాండ్ను తీసుకొచ్చింది. భారతదేశంలో ప్లాస్టిక్రహిత టేబుల్క్లాత్ని తయారుచేసిన ఘనత కూడా ఆమెకు దక్కింది.
2020లో ఒకరోజు సాయంత్రం ఇందిరా డైనింగ్ రూమ్లో నిల్చుని ఉంది. రోజులాగే డైనింగ్ టేబుల్ మీద తన ఇద్దరు పిల్లలు చేసిన మరకలను తుడుస్తూ ఉంది. రోజూవారీలాగా ఆ రోజు గడిచిపోతే ఆమె కథ మనం ఈ రోజు చెప్పుకొనేవాళ్లమే కాదు. ప్లాస్టిక్తో తయారుచేసిన టేబుల్క్లాత్ ఉతకడం సులభమే. కానీ అది కొన్ని ఉతుకుల తర్వాత కళని కోల్పోవడం గమనించింది ఇందిరా. అసలు ఈ టేబుల్క్లాత్ దాని కళ పోకుండా ఉండేందుకు ఏమీ చేయలేనా? అంటూ ఆలోచనలో పడింది. ఇదే ఫ్యాబ్రిక్ని కాకుండా వేరేది వాడలేమా? అనుకుంది.

భారతదేశంలో ఇలా తుడవగల, ప్లాస్టిక్ రహిత కాటన్ టేబుల్ క్లాత్లను అందిస్తున్న కంపెనీగా పేరుగాంచింది. ప్రస్తుతానికి 10వేల ఇండ్లలో తన ప్రొడక్ట్లను చేర్చగలిగింది. అంటే.. సుమారు 30వేల ప్రొడక్ట్లను మూడు సంవత్సరాల్లో అమ్మగలిగింది. అమ్మగా చేసిన ఆలోచన ఆచరణాత్మకంగా సక్సెస్ సాధించింది.
బిజినెస్ ఆలోచన..
బిట్స్ పిలానీలో కెమికల్ ఇంజినీరింగ్ పూర్తి చేసి, అటు పై ఎంబీఏ చదివింది ఇందిరా. 44 సంవత్సరాల ఈమె కొల్గెట్ పామోలివ్, ఫ్లిప్కార్ట్ల్లో మార్కెటింగ్ విభాగంలో పని చేసింది. కానీ 2012లో తన ఇద్దరు కూతుళ్ల భవిష్యత్తు కోసం కార్పొరేట్ జీవితానికి బ్రేక్ ఇచ్చింది. అదే సమయంలో తనకెప్పటి నుంచో ఇష్టమున్న హోమ్ డెకర్ లో ఏదైనా చేయాలనుకుంది. చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో ఏదో ఒకటి పడేయడం దాన్ని ఉతుకడం అనేది జరుగుతూనే ఉంటుంది. టేబుల్క్లాత్ ఇందులో మొదటిదయ్యి ఉంటుంది. అందుకే దాన్ని లెనిన్తో ఎందుకు తయారు చేయకూడదనుకుంది ఇందిరా. కానీ దాన్ని తయారు చేయడానికి ఏ మ్యానుఫ్యాక్చరర్ ఒప్పుకోలేదు. చాలా చోట్ల ఆమెకు తిరస్కరణే ఎదురయ్యింది. 500 రోజుల పాటు 11 నమూనాలను తయారుచేసుకుంది. దీనికోసం ఎన్నో టెక్సటైల్ ఫ్యాక్టరీలకు వెళ్లింది. చివరగా సక్సెస్ సాధించింది. అలా ద యార్డ్ హౌస్ పేరుతో ఇప్పుడు టేబుల్ క్లాత్ విక్రయం చేస్తున్నది.
అలా మొదలైంది..
ఇందిరా గురుగ్రామ్, తమిళనాడు.. ఇలా చాలా రాష్ట్రాలు తిరిగింది. చివరకు జైపూర్లో బ్లాక్ ప్రింటింగ్ కంపెనీ తన ఆలోచనకు ఒక కార్యరూపం ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. యూనిక్గా ఉండేందుకు ఈరోడ్, సూరత్ నుంచి లెనిన్ ఫ్యాబ్రిక్ తెప్పించి దానిపై ప్రింటింగ్ వేయిస్తున్నది. బెంగళూరులో హెడ్ ఆఫీస్కి ఈ ప్రొడక్ట్ చేరుతుంది. అయితే ద యార్డ్ హౌస్ మొదలుపెట్టిన కొన్ని నెలల్లోనే కోవిడ్-19 ప్రారంభమైంది. ఆ సమయంలో చాలా ఫ్యాక్టరీలు మూసేయాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ అదే సమయంలో తను మరింత చురుకుగా ఆలోచించి కొత్త కొత్త ఆలోచనలకు శ్రీకారం చుట్టింది. దానికి మ్యానుఫ్యాక్చరర్స్ కూడా ఆమెకు అండగా నిలిచి సహకారం అందించారు.

సోషల్ మీడియా ద్వారా..
మొదట కేవలం 35 టేబుల్ క్లాత్లను తయారుచేయించింది ఇందిరా. కానీ దాన్ని అమ్మడం ఎలా చేయాలని ఆలోచించి తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. గంటలో మొదటి ఆర్డర్ వచ్చింది. కొన్నిరోజుల్లోనే తాను తయారుచేయించిన టేబుల్క్లాత్లన్ని అమ్ముడుపోయాయి. పెట్ ప్రాజెక్ట్గా మొదలైన ఆమె వ్యాపారం ఇప్పుడు మరింత విస్తరిచింది. తనతో పాటు మరో ఏడుగురు మహిళలు పనిచేస్తున్నారు. వారికింద 70మంది ఆర్టిస్ట్లు టేబుల్ క్లాత్లను, ప్లేట్ మ్యాట్లను తయారుచేస్తున్నారు.
రాబడిలో..
కేవలం టేబుల్ క్లాతింగ్తో ఆగిపోవాలనుకోవడం లేదు ఇందిరా. తన వ్యాపారాన్ని మరింత విస్తరించాలని అనుకుంటున్నది. దుప్పట్లు, టవల్స్ ని కూడా తయారుచేయాలని అనుకుంటున్నది. ద యార్డ్ హౌస్ వెబ్సైట్లలోనే కాకుండా అమెజాన్ ద్వారా కూడా ఈ టేబుల్ క్లాత్లను అమ్ముతున్నది. ఇప్పటివరకు మూడు కోల్ల రాబడి సాధించింది. 2025 చివరికల్లా భారతదేశంలోనే కాకుండా విదేశాల్లో సైతం తన బ్రాండ్ను విస్తరించాలని అనుకుంటున్నది.