విదేశాల్లో కొందరు, మన సెలెబ్రిటీలు సైతం ఐస్బాత్ని తమ ఫిట్నెస్లో భాగం చేసుకున్నారు. కానీ ఈ ఐస్బాత్తో మరింత ఆరోగ్యం మెరుగుపడుతుంది ఒక ఫిట్నెస్ ట్రైనర్ నమ్మాడు. ఐస్మ్యాన్ ఇండియా బ్రీత్ వర్కౌట్ పేరుతో ఈ ఐస్ బాత్ చేయిస్తున్నాడు. అతనే.. షేక్ అజ్గర్ సుల్తాన్.
విరాట్ కోహ్లీ, సమంత్, విజయ్ దేవరకొండ.. ఇలా చాలామంది ప్రముఖులు తమ ఫిట్నెస్ని పెంచుకోవడానికి ఐస్బాత్లను ఆశ్రయిస్తున్నారు. హైదరాబాద్లో ఈ ఐస్బాత్ థెరపీ గణనీయంగా పెరిగింది. ఈ ఫిట్నెస్ మంత్రాన్ని పట్టుకొని షేక్ అజ్గర్ సుల్తాన్ ఒక కొత్త ట్రెండ్ని మొదలుపెట్టాడు. డాక్టర్లు, యాక్టర్లు.. ఇలా చాలామందికి వ్యక్తిగత శిక్షణని అందిస్తున్నాడు.
ఫిట్నెస్ నుంచి..
షేక్ అజ్గర్.. 10 సంవత్సరాల పాటు ఐటీ పరిశ్రమలో పని చేశాడు. అదే సమయంలో ఫిట్నెస్ పట్ల ఆకర్షితుడయ్యాడు. మార్షల్ ఆర్ట్స్, కిక్ బాక్సింగ్ నేర్చుకున్నాడు. తరుచుగా బ్యాంకాక్కి మిక్సడ్ మార్షల్ ఆర్ట్స్ కోసం వెళ్లేవాడు. థాయ్లాండ్లో ఎలైట్ ఫైట్ క్లబ్లో సభ్యుడయ్యాడు. అటు ఉద్యోగం, ఇటు మార్షల్ ఆర్ట్స్తో బిజీబిజీ లైఫ్ గడిపాడు. ఆ సమయంలోనే ఐస్బాత్ థెరపీ పరిచయమయింది.
ఉద్యోగం వదిలి..
ఫిట్నెస్, అటు ఉద్యోగం అంటే.. ఫిట్నెస్కే ఓటేశాడు షేక్ అజ్గర్. అలా ఐదు సంవత్సరాల క్రితం ఉద్యోగం వదిలి కార్పొట్ వైస్ ప్రెసిడెంట్లు, డాక్టర్లు ప్రత్యేక సెషన్స్ తీసుకునేవాడు. పైగా ఆధునిక సాంకేతిక లేని ఆ యుగంలో వ్యక్తులు శ్వాస, మెదడు మీద పట్టు సాధించాలంటే ఐస్బాత్ థెరపీలాంటి వాటినే ఉపయోగించే వారని తెలుసుకున్నాడు. ఆ సంప్రదాయల నుంచి ప్రేరణ పొందిన అతను యోగా సెషన్స్ల్లో పాల్గొన్నాడు. హైదరాబాద్లో ఐస్బాత్ ప్రవేశపెట్టాలని నిర్ణయించుకున్నాడు.

ఐస్బాత్ థెరపీ..
షేక్ అజ్గర్ సుల్తాన్, అతని బృందం మొబైల్ ఐస్ బాత్ థెరపీని ప్రారంభించారు. వారు అమెరికా, చైనా నుంచి దిగుమతి చేసుకున్న ప్రత్యేకంగా రూపొందించిన టబ్లతో సహా పూర్తి సెటప్ను క్లయింట్ల స్థానాలకు తీసుకువస్తారు. దీనికి ఐస్మ్యాన్ ఇన్ ఇండియా పేరు రాయించాడు. ఐస్ తయారీదారులతో భాగస్వామ్యం, వారు ప్రామాణికమైన ఐస్ బాత్ అనుభవాన్ని సృష్టించడానికి సున్నా డిగ్రీల వద్ద మంచు డెలివరీ చేస్తారు. భారతదేశంలో ఇంత తక్కువ ఉష్ణోగ్రతల వద్ద ఐస్ బాత్ థెరపీని అందించే మొదటిదిగా గుర్తించబడింది.
ఈ విధానం మొదట్లో శరీరాన్ని తీవ్రమైన చలికి గురి చేయరు. ముందుగా సుమారు 45 నుండి 50 నిమిషాల పాటు స్ట్రెచ్చింగ్, శ్వాసపై సమగ్ర సెషన్ ఉంటుంది. దీని తరువాత, పాల్గొనేవారు సున్నా డిగ్రీ ఉష్ణోగ్రత ఉన్న టబ్లో మునిగిపోతారు, దీని కోసం 100 నుండి 200 కిలోల ఐస్ క్యూబ్లను వాడుతారు. దీన్ని కూడా ఒకేసారి కాకుండా మూడు రౌండ్లు నిర్వహిస్తారు. మొదటిది వార్మప్గా పనిచేస్తుంది. ఇది 45 సెకన్ల నుండి ఒక నిమిషం వరకు ఉంటుంది. రెండవ రౌండ్లో శ్వాస పద్ధతులు, కోర్, స్కాపులా మరియు బైసెప్స్ వంటి కీలకమైన ప్రాంతాలను వేడిక్కించాకే టబ్ నుంచి బయటకు అడుగు పెట్టడం జరుగుతుంది. ఈ ప్రాంతాలు ఎక్కువ వేడిని ఉత్పత్తి చేస్తాయి. ఆ తర్వాత ఇంకో సెషన్తో ఈ థెరపీ పూర్తవుతుంది. అయితే కొందరు సొంతంగా ప్రయత్నం చేయడానికి చూస్తున్నారు. కానీ అది మాత్రం చేయొద్దంటున్నాడు షేక్ అజ్గర్. ఎందుకంటే తానే సమర్థవంతంగా శిక్షణ ఇవ్వడానికి రెండు సంవత్సరాలు పట్టింది. ఇప్పుడు తాను సున్నా డిగ్రీల వద్ద 13 నిమిషాలు, -1 డిగ్రీల వద్ద ఏడు నిమిషాల పాటు ఈ థెరపీ చేసి రికార్డు సృష్టించాడు.
ఉపశమనంగా..
షేక్ అజ్గర్.. “అథ్లెట్లు కోలుకోవడానికి ఐస్ బాత్లను ఉపయోగిస్తుంటారు. ప్రత్యేక శ్రద్ధ వహించే పిల్లలు, ఆటిజం ఉన్న వ్యక్తులు, నిద్ర రుగ్మతలు ఉన్నవారు, ఆందోళనతో సతమతమయ్యేవారు ఈ ఐస్ బాత్ థెరపీ తీసుకుంటే మంచిది. ఇది శరీరంలో డోపమైన్ స్థాయిలను పెంచుతుంది. ఉదాహరణకు, ఒక వ్యక్తికి సంతోషంగా ఉండటానికి సాధారణంగా 80-100 డోపమైన్ స్థాయిలు ఉంటాయి. కానీ ఐస్ బాత్ తర్వాత ఇది 300-500 వరకు పెరుగుతుంది. నిరాశ, చైన్ స్మోకింగ్ లేదా నిద్ర రుగ్మతలను ఎదుర్కొంటున్న వారికి ఉపశమనం అందిస్తుంది” అంటున్నాడు.