సెలబ్రిటీలు వస్తున్నారంటే జనాలు గుమిగూడతారు. వారిని చెదరగొట్టడం అంటే మామూలు విషయం కాదు. దానికి మగ బౌన్సర్లను సెలెక్ట్ చేస్తారు. కానీ మోహన్లాల్కి ఒక లేడీ బౌన్సర్ పని చేస్తుంది. ఆమె గురించి నెట్టింట తెగ చర్చ జరుగుతున్నది.
లూసిఫర్ సీక్వెల్ L2: ఎంపురాన్ సినిమా విడుదలైంది. ఈ సినిమా ప్రమోషన్ సమయంలో అను కుంజుమన్ కనిపించింది. దీంతో దేశమంతటా ఆమె గురించి చర్చ మొదలైంది. అను కుంజుమన్ కేరళ తొలి మహిళా బౌన్సర్గా చరిత్ర సృష్టిస్తుంచారు. ఒకరకమైన స్టీరియో టైప్ని సవాలు చేస్తూ, సెలబ్రిటీ ఈవెంట్లను నిర్వహించడం నుంచి ఉన్నత స్థాయి సమావేశాలలో భద్రతను నిర్ధారించడం వరకు భద్రతా పరిశ్రమలో మహిళలు రాణించగలరని నిరూపిస్తున్నది.
చాలా సంవత్సరాలుగా, బౌన్సర్ అనే ఇమేజ్ సెలబ్రిటీ ఈవెంట్లు, పబ్బులు, పార్టీలలో జనసమూహాన్ని నిర్వహించేందుకు పొడవైన, కండలు తిరిగిన పురుషులను తీసుకోవడం చేశారు. అయితే అను కుంజుమన్ ఆ అభిప్రాయాన్ని మారుస్తున్నారు. 37 ఏళ్ల వయసులో ఆమె కేరళలోని తొలి మహిళా బౌన్సర్లలో ఒకరిగా మారింది. బలం, ఆత్మవిశ్వాసం, అధికారం పురుషులకే పరిమితం కాదని నిరూపించింది. ఇటీవల, ఆమె సూపర్ స్టార్ మోహన్ లాల్ భద్రతా బృందంలో భాగమై వార్తల్లో నిలిచింది.

గౌరవప్రదమైన జీవితం కోసం ప్రయత్నిస్తూనే తన తల్లి, సోదరిని పోషించే బాధ్యతను స్వీకరించడంతో ఈ రంగంలో ఆమె ప్రయాణం వ్యక్తిగత పోరాటాల ద్వారా మొదలైంది. అను కుంజుమన్ తన కెరీర్ను ఫొటోగ్రాఫర్గా ప్రారంభించింది. సినిమా ప్రమోషన్లు, సెలబ్రిటీ ఈవెంట్లలో ఆ క్షణాలను తన కెమెరాలో బంధించేది. అయితే ఒక అసైన్మెంట్ సమయంలో ఒక పురుష బౌన్సర్తో జరిగిన ఎన్కౌంటర్, భద్రతా పాత్రల్లో మహిళలు లేకపోవడాన్ని ఆమెను ఆ రంగం వైపు ఆలోచించేలా చేసింది. ఆమె దృఢసంకల్పం పెరిగింది, చివరికి పురుషాధిక్య భద్రతా రంగంలో ఆమె కెరీర్ను కొనసాగించేలా చేసింది.
అను కుంజుమన్ ప్రముఖుల కార్యక్రమాల నుంచి ఉత్సాహభరితమైన పబ్ పార్టీల వరకు అనేక ఉన్నత స్థాయి కార్యక్రమాలలో భద్రతను నిర్వహిస్తున్నది. అద్భుతమైన కెరీర్ను నిర్మించుకుంది. ప్రస్తుతం మహిళా బౌన్సర్లకు డిమాండ్ పెరుగుతోంది. ముఖ్యంగా అవార్డు వేడుకలు, ప్రముఖుల సమావేశాలు, నైట్ లైఫ్ వేదికలలో వీరి అవసరం ఉన్నది. ఈ వృత్తిలోని మహిళలు ఇప్పుడు వారి పురుష సహచరులతో సమాన వేతనం పొందుతున్నారని ఆమె హైలైట్ చేశారు.
ఈవెంట్ సెక్యూరిటీతో పాటు, మహిళా సెలబ్రిటీలు, వ్యాపార నిపుణులను ఎస్కార్ట్ చేసే బాధ్యతను కూడా అనుకు అప్పగించారు. అనూహ్యమైన జనసమూహాన్ని నిర్వహించడంలో సవాళ్లు ఉన్నప్పటికీ, లింగంతో సంబంధం లేకుండా ప్రజలను నిర్వహించడంలో తాను ఎప్పుడూ ఇబ్బందులను ఎదుర్కోలేదని ఆమె నమ్మకంగా చెబుతుంది.
ఇదిలా ఉండగా.. సూపర్ స్టార్ మోహన్ లాల్ ప్రస్తుతం పృథ్వీరాజ్ దర్శకత్వం వహించిన L2: ఎంపురాన్ విజయాన్ని ఆస్వాదిస్తున్నారు. థియేటర్లలో ప్రదర్శితమవుతున్న ఈ చిత్రం విస్తృత ప్రశంసలను పొందింది. దీనితో దాని చుట్టూ ఉన్న సంచలనం మరింత పెరిగింది.