భారతదేశం అంటేనే వైవిధ్యాలకు పుట్టినిల్లు. అందులోనూ ఒక్కో ప్రాంతంలో ఒక్కో ఆహార పద్ధతికి ప్రసిద్ధి చెందింది. అయితే అనేక రాష్ట్రాలు అధిక శాతం శాఖాహారులున్నారట.
తెలంగాణలాంటి ప్రాంతంలో ముక్క లేనిదే ముద్ద దిగదు. అలా చాలా రాష్ట్రాల్లో కూడా ఉందని అనుకుంటారు. కానీ షాకింగ్గా భారతదేశంలోని చాలా రాష్ట్రాల్లో అధికంగా వెజిటేరియన్స్ అదేనండీ.. శాఖాహారులన్నారని తేలింది. స్థానిక సంప్రదాయాలు, మత విశ్వాసాలు, సాంస్కృతిక ఆచారాలు వంటి అంశాలచే ఈ ప్రాంతాలు ప్రభావితమయ్యాయి.
రాజస్థాన్
శాతం: జనాభాలో దాదాపు 71.17% నుంచి 75% వరకు శాఖాహారులు.
ప్రభావం: బలమైన సాంస్కృతిక సంప్రదాయాలు, జైనమతం ప్రభావం దానివల్ల అధిక శాఖాహారులున్నారు.
హర్యానా
శాతం: జనాభాలో దాదాపు 69.2% నుంచి 80% వరకు శాఖాహార ఆహారాన్ని అనుసరిస్తారు.
ప్రభావం: వ్యవసాయ సంస్కృతి, మత విశ్వాసాలు ముఖ్యమైన అంశాలు.
గుజరాత్
శాతం: జనాభాలో దాదాపు 62.44% నుంచి 61.9% వరకు శాఖాహారులు.
ప్రభావం: ప్రధానంగా శాఖాహార వంటకాలు, జైన మతం, హిందూ మత ప్రభావం.
పంజాబ్
శాతం: జనాభాలో దాదాపు 58.58% నుంచి 66.75% వరకు శాఖాహారులు.
ప్రభావం: సిక్కు సంస్కృతి, మతపరమైన ఆచారాలను పాటించడం వల్ల అధిక శాతం శాఖాహారులున్నారు.
మధ్యప్రదేశ్
శాతం: జనాభాలో దాదాపు 46.93% నుంచి 50% కంటే ఎక్కువ మంది శాఖాహారులు.
ప్రభావం: సాంస్కృతిక, మతపరమైన ఆచారాలు కీలకమైన అంశాలు.
ఇతర రాష్ట్రాలు..
ఈ ఐదు కాకుండా మరో మూడు రాష్ట్రాలు కూడా కొంతమేర శాఖాహారానికి అలవాటు పడ్డాయి. వాటి గురించి..
హిమాచల్ ప్రదేశ్: స్థానిక ఆచారాలు, మతపరమైన ఆచారాల ద్వారా ప్రభావితమైన గణనీయమైన శాఖాహార జనాభాకు ప్రసిద్ధి చెందింది.
మహారాష్ట్ర: గణనీయమైన శాఖాహార జనాభా, ముఖ్యంగా పూణే, ముంబై వంటి పట్టణ ప్రాంతాలలో.
ఉత్తర ప్రదేశ్: శాఖాహారం రాష్ట్ర సంస్కృతి, మతపరమైన ఆచారాలలో లోతుగా పాతుకుపోయింది.