మొఘల్ సామ్రాజ్య సమయంలో ముంతాజ్ ప్రేమకు చిహ్నంగా షాజహాన్ తన సమాధిని కట్టించాడు. కానీ మధ్యప్రదేశ్కి చెందిన ఒక భర్త.. తన భార్య ప్రేమ వెలకట్టలేనిదని, ఆమె ప్రేమకు బహుమతిగా తాజ్మహల్లాంటి నాలుగు బెడ్రూమ్ల ఇల్లు కట్టించాడు.
భారతదేశంలో శాశ్వత ప్రేమకు చిహ్నం అంటే అందరూ వెంటనే తాజ్మహల్ పేరే చెబుతారు. యమునా నది ఒడ్డున ఉన్న దంతపు-తెలుపు పాలరాయి సమాధిని 1632లో మొఘల్ చక్రవర్తి షాజహాన్ తన అభిమాన భార్య ముంతాజ్ మహల్ సమాధిని ఉంచడానికి నియమించాడు. నిర్మాణ అద్భుతాన్ని పునరావృతం చేయలేనప్పటికీ, కొంతమంది ప్రతిరూపాలను తయారు చేయడంలో ప్రశంసనీయమైన ప్రయత్నాలు చేశారు. ఇటీవల, మధ్యప్రదేశ్కు చెందిన ఒక భర్త తన భార్యకు తాజ్ మహల్ ప్రతిరూపాన్ని బహుమతిగా ఇచ్చాడు. ఇది బుర్హాన్పూర్లో ఒక ఖరీదైన ఇల్లుగా కూడా ఇప్పుడు ప్రసిద్ధికెక్కింది.
నిర్మాణం వెనుక ఉన్న ఆనంద్ చోక్సే ఎల్లప్పుడూ పాలరాయి సమాధిని ఊహించుకునేవాడు. ముంతాజ్ చివరి శ్వాస తీసుకున్న తన బుర్హాన్పూర్లో దానిని ఎందుకు నిర్మించలేదో అని ఆలోచించేవాడు. ఈ ఆలోచనే అతన్ని 4 బెడ్రూమ్ల ఇంటిని నిర్మించాలనే ఆలోచన వైపు నడిపించింది. అది కూడా తాజ్ మహల్కు ప్రతిరూపంగా ఉంటుంది. 2018లో మొదలైన ఆలోచన ఇప్పుడు పూర్తయింది. ప్రియమ్ సరస్వత్ అనే ఇన్స్టా కంటెంట్ క్రియేటర్ భారతదేశంలో, అమెరికాలో యూనిక్గా ఉండే ఇండ్లని చూపిస్తుంటాడు. అలా అతను ఈ తాజ్మహల్ ఇంటిని కూడా హోంటూర్ చేశాడు. అదికాస్త నెట్టింట వైరల్గా మారడంతో అందరూ ఈ ఇంటిని చూడడానికి ఆసక్తి చూపిస్తున్నారు.
ఇంటి ఇంజనీర్ నిర్మాణాన్ని ప్రారంభించే ముందు తాజ్ మహల్ను అధ్యయనం చేయాల్సి వచ్చింది. ఇంటి లోపలి భాగాన్ని చెక్కడానికి అతను బెంగాల్, ఇండోర్కు చెందిన కళాకారుల సహాయం కోరాడు. పూర్తయిన ప్రాజెక్టులో 29 అడుగుల గోపురానికి ఎక్కువ సమయం పట్టిందట. ముందు తాజ్ మహల్ లాంటి టవర్లు ఉన్నాయి. ఫ్లోరింగ్ రాజస్థాన్లోని ‘మక్రానా’ నుంచి తయారు చేయబడింది. ఫర్నిచర్ను ముంబైకి చెందిన కళాకారులు ప్రత్యేకంగా రూపొందించారు. ఈ ఇంట్లో మొత్తం నాలుగు బెడ్రూమ్లు, ఒక పెద్ద హాలు, ఒక లైబ్రరీ, ధ్యాన గది ఉన్నాయి. ఈ ఇల్లు ఉష్ణోగ్రత కూడా ఏ కాలమైనా ఒకటే ఉండేలా ప్రత్యేకంగా రూపొందించారు. అంతేకాదు.. తాజ్ మహల్ లాగానే మొత్తం ఇల్లు దాని వినూత్న లైటింగ్ కారణంగా చీకటిలో ప్రకాశిస్తుంది.

ఆనంద్ చోక్సే ఒక స్కూల్ని కూడా నడుపుతున్నాడు. ఆ స్కూల్ క్యాంపస్లోనే ఈ ఇంటి నిర్మాణం చేపట్టినట్టు చెప్పాడు. దీనికి కారణం.. పిల్లలకు వాళ్లు దగ్గరగా ఉండేందుకేనని కూడా చెప్పాడు. చిన్నప్పుడు పాలు అమ్మి మరీ పైకి వచ్చామని.. అది మరచిపోకూడదని ఫ్లోరింగ్లో గోమాత బొమ్మను చిత్రీకరింపచేశాడు. దీనికి కారణం.. తను ఎక్కడా నుంచి వచ్చానో ప్రతీ అడుగులోనూ గుర్తు పెట్టుకొనేలా దాన్ని చిత్రించినట్లు చెప్పాడు ఆనంద్. వారి కుటుంబ ఆలోచనలు, పిల్లల భవిష్యత్ పట్ల వారికి ఉన్న నిబద్ధతకు నిజంగా హ్యాట్సాఫ్ చెప్పి తీరాల్సిందే!