కావాల్సిన పదార్థాలు:
బియ్యం : 250గ్రా||
టమాటలు: 4 పెద్దవి
లవంగాలు : 4
యాలకులు : 3
దాల్చిన చెక్క : ఒక ఇంచు ముక్క
ఉల్లిపాయ : ఒకటి
కారం : ఒక టీస్పూన్
అల్లం వెల్లుల్లి పేస్ట్: ఒక టీ స్పూన్
ధనియాల పొడి: ఒక టీస్పూన్
నెయ్యి : ఒక టీస్పూన్
కొత్తిమీర: ఒక కట్ట
ఉప్పు,నూనె : సరిపడినంత
తయారీ విధానం :
స్టెప్ 1: ముందుగా అన్నం వండి పెట్టుకోవాలి. ఉల్లిపాయ, 2 టమాటాలు కట్ చేసుకొని మిక్సీ పట్టి పెట్టుకోవాలి. మరో రెండు టమాటాలను చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
స్టెప్ 2: స్టౌపై ఒక కడాయి పెట్టుకొని నెయ్యి , 2 టీ స్పూన్ల నూనె పోసి వేడి అయ్యాక లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి.
స్టెప్ 3 : ఉల్లిపాయ వేగిన తర్వాత మిక్సీ పట్టుకున్న టమాటా మిశ్రమం వేసి పచ్చి వాసన పోయే వరకు కలుపాలి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు కట్ చేసుకున్న టమాట ముక్కలు వేసుకొని ఉడికించుకోవాలి.
స్టెప్ 4: ఇప్పుడు అందులో ధనియాల పొడి, ముందుగా వండిన అన్నం వేసి కలుపుకోవాలి. చివరిగా కొత్తిమీర వేసి కలిపి రెండు నిమిషాల తర్వాత దించేయాలి. దీనిని ఇలాగే లాగించేయొచ్చు. లేదా పెరుగు పచ్చడితో తింటే మరింత టేస్టీగా ఉంటుంది.