ఐదు రోజుల నొప్పి తగ్గాలంటే.. ఆ సమయంలో తాగాల్సిన డ్రింక్స్!

స్త్రీలు ప్రతినెలా పీరియడ్ నొప్పి సమస్యను ఎదుర్కుంటారు. కడుపులో, నడుము.. ఇలా ఒళ్లంతా నొప్పులతో బాధపడుతుంటారు. దీనికోసం కొన్ని డ్రింక్స్ తాగితే నొప్పి నుంచి ఉపశమనం పొందొచ్చు.

పగలు, రాత్రి విశ్రాంతి లేకుండా పని చేస్తుంటారు ఆడవాళ్లు. దీంతో ఆ ఐదు రోజులు మరింత బాధపడుతుంటారు. కొందరికి మామూలుగా ఉన్నా, మరికొందరికి సమస్యత్మాకంగా ఉండొచ్చు. సహజమైన పద్ధతిలో పీరియడ్స్ నొప్పి నుంచి ఉపశమనం పొందాలంటే ఈ పానీయాలను తాగి కొంత మేర హాయిగా ఉండొచ్చు.

నీళ్లు..
అతి ముఖ్యమైన ద్రవం నీళ్లు. పీరియడ్స్ సమయంలో తప్పనిసరిగా గోరువెచ్చని నీరు తాగాలి. రిఫ్రిజిరేటర్ నీరు మంచిది కాదు. గోరువెచ్చని నీటికి కొద్దిగా సోంపు వేసి మరిగించిన నీటిని తాగడం వల్ల కూడా పీరియడ్స్ వచ్చే నొప్పి తగ్గుతుంది. పీరియడ్స్ లో వచ్చే తిమ్మిర్లు లేదా ఉబ్బరం ఉంటే కూడా ఈ నీరు మీకు కచ్చితంగా ఉపశమనం ఇస్తుంది.

అల్లం నీరు..
అల్లం యాంటీ ఇన్ఫ్లమేషన్ లక్షణాలను కలిగి ఉంది. ఇది తిమ్మిరికి చాలా సహాయకారిగా ఉంటుంది. ఒక గ్లాసు నీటిలో తురిమిన అల్లం వేసి మరిగించాలి. ఆ తర్వాత చల్లారనిచ్చి వడగట్టి తాగాలి. ఈ నీరు గోరువెచ్చగా ఉన్నప్పుడే తాగితే మంచి మందుగా పని చేస్తుంది.

పసుపు నీళ్లు..
చింతపండును కాసేపు నానబెట్టాలి. ఈ చింతపండును ఉడికించాలి. దీంట్లో కాసింత పసుపు వేసి కలుపుకోవాలి. ఈ నీళ్లకు కొద్దిగా తేనె లేదా చక్కెర వేయాలి. బెల్లం మాత్రం కలుపొద్దు. ఈ నీటిని గోరువెచ్చగా ఉన్నప్పుడే తాగితే నొప్పి చాలా వరకు తగ్గుతుంది.

చమోమిలే టీ..
గ్రీన్ టీ, హెర్చల్ టీలు కూడా నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తాయి. ఇందులో చమోమిలే టీ ఒక మంచి ఎంపిక. ఈ టీ వల్ల నరాలకు విశ్రాంతి కలిగి, కండరాల నొప్పులు తగ్గుతాయి. ఇది మీ గర్భాశయాన్ని రిలాక్స్ చేస్తుంది. అల్లం వలె, ఇది కూడా రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.

పైనాపిల్ జ్యూస్..
ఈ జ్యూస్లో మినరల్స్ ఉంటాయి. మంట, చికాకు తగ్గించడంలో సహాయపడుతుంది. ఇందులో ఉండే బ్రోమెలైన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది కండరాల నొప్పి తగ్గిస్తుంది.


అయితే మీకు వీటిలో ఏదైనా వాటితో ఎలర్జీ ఉంటే వాటి జోలికి వెళ్లకపోవడం మంచిది. వైద్యుడిని సంప్రదించి తర్వాత ఈ పానీయాలను తీసుకోండి.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Powered by WordPress