ఉపవాసం సమయంలో ఏదైనా అల్పాహారం తీసుకుంటుంటారు కొందరు. అలాంటి వారికి టేస్టీ సగ్గుబియ్యం కిచిడీ ఎలా తయారు చేయాలో తెలుసుకోండి.
సగ్గుబియ్యంతో కేవలం జావా, పాయసమే కాదు.. రుచికరమైన కిచిడీ కూడా చేసుకోవచ్చు. పైగా ఈ అల్పాహారం మీకు తేలికగా జీర్ణమవుతుంది. కార్బొహైడ్రేట్స్ తక్కువగా ఉండే ఇది కేవలం ఉపవాస సమయంలోనే కాదు.. బరువు తగ్గాలనుకునేవారికి కూడా మంచి ఆహారం. కాబట్టి ఒకసారి దానికి కావాల్సినవి, తయారీ విధానం ఏంటో ఒక లుక్కేయండి.

కావాల్సిన పదార్థాలు :
సగ్గుబియ్యం : ఒక కప్పు
పల్లీలు : పావు కప్పు
ఆలుగడ్డ : 1
కరివేపాకు : ఒక రెమ్మ
నూనె : ఒక టేబుల్ స్పూన్
జీలకర్ర : పావు టీస్పూన్
పచ్చిమిర్చి : 4
ఉప్పు : తగినంత
తయారీ విధానం :
స్టెప్ 1 : సగ్గు బియ్యం కడిగి కనీసం రెండు గంటల పాటు నానబెట్టాలి.
స్టెప్ 2 : ఆలుగడ్డను ఉడికించి చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి.
స్టెప్ 3 : ఇప్పుడు నానబెట్టిన సగ్గుబియ్యాన్ని ఒక జల్లెడలో వేసి నీళ్లు మొత్తం వడకట్టాలి.
స్టెప్ 4 : ఆ తర్వాత కడాయిలో పల్లీలు వేసి వేయించాలి. అందులో కొన్ని పల్లీలను పక్కన పెట్టి మిగిలిన పల్లీలను పొడి చేసుకోవాలి.
స్టెప్ 5 : పెద్ద గిన్నెలో నూనె పోసి వేడయ్యాక జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి వేసి వేయించాలి. ఇందులోనే వేయించుకున్న పల్లీలు వేసి కాసేపు వేగనివ్వాలి.
స్టెప్ 6 : ఇందులో వడకట్టిన సగ్గుబియ్యం వేసి ఒకసారి కలుపాలి. ఇప్పుడు ఉప్పు, పల్లీల పొడి వేసి బాగా కలుపాలి. పచ్చి వాసన పోయాక స్టవ్ ఆపేస్తే సరిపోతుంది. టేస్టీ సగ్గుబియ్యం కిచిడీ రెడీ!