కావాల్సిన పదార్థాలు:
పల్లీలు : 500 గ్రా.
నువ్వులు : 250 గ్రా.
బెల్లం : 750 గ్రా.
నెయ్యి :100 గ్రా.
యాలకులు : 10
నీళ్లు : ఒక టీస్పూన్
తయారీ విధానం :
స్టెప్ 1: ఒక కడాయి పెట్టుకొని పల్లీలు వేయించుకోవాలి. నువ్వులు కూడా వేరుగా వేయించుకోవాలి.
స్టెప్ 2: పల్లీలు పొట్టుపోయేలా చేసి పలుకులుగా చేసుకోవాలి. బెల్లం మెత్తగా చేసి పట్టన పెట్టుకోవాలి.
స్టెప్ 3 : ఇంకో గిన్నెలో బెల్లం, యాలకులు వేసుకొని నీళ్లు పోసుకొని స్టౌ పై పెట్టుకొని లేత పాకం వచ్చేదాకా ఉంచుకొని నెయ్యి వేసి దింపేయాలి. ఇప్పుడు పలుకులు చేసుకున్న పల్లీలు, నువ్వులు వేసుకోని కలుపుకోవాలి.
స్టెప్ 4 : ఒక ప్లేట్కి నెయ్యి రాసి పల్లీలు, నువ్వుల మిశ్రమం వేసుకొని సమానంగా స్ప్రెడ్ చేసుకోవాలి. మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకుంటే సరిపోతుంది.