ఎండ‌ల్లో స‌గ్గుబియ్యం-బియ్యం వ‌డియాలను ఆర‌బెట్టేయండి!

కావాల్సిన ప‌దార్థాలు :
బియ్యం : ఒక క‌ప్పు
స‌గ్గు బియ్యం : ఒక క‌ప్పు
నీళ్లు : 11 గ్లాసులు
ప‌చ్చిమిర్చి : 5
అల్లం : 2 ఇంచుల ముక్క‌
ఉప్పు : స‌రిప‌డినంత‌
జీల‌క‌ర్ర : ఒక టీ స్పూన్

త‌యారీ విధానం :
స్టెప్1 :
బియ్యం, స‌గ్గు బియ్యం ముందు రోజు నైట్ నాన‌బెట్టుకోవాలి. నాన‌బెట్టిన బియ్యంలో ఒక క‌ప్పు నీళ్లు పోసి మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకోవాలి.
స్టెప్ 2: మ‌రో మిక్సీ జార్లో ప‌చ్చిమిర్చి, అల్లం కూడా మిక్సీ ప‌ట్టుకోవాలి. సగ్గు బియ్యంలో రెండు గ్లాసుల నీళ్లు పోసి ఉడికించుకొని పెట్టుకోవాలి.
స్టెప్3 : ఇంకో గిన్నె పెట్టుకొని 9 గ్లాసుల నీళ్లు పోసుకోని మ‌రుగుతున్న నీళ్ళ‌లో మిక్సీ ప‌ట్టుకున్న బియ్యం పిండి మిశ్ర‌మం పోసుకొని స‌న్న‌ని మంట‌పై 15 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా ఉడికిస్తున్న స‌మ‌యంలో క‌లుపుతుండాలి.
స్టెప్ 4: ఉడికించుకున్న స‌గ్గుబియ్యంలో ప‌చ్చిమిర్చి మిశ్ర‌మం, ఉప్పు, జీల‌క‌ర్ర‌ కూడా వేసి క‌లుపుకోవాలి. దీన్ని ఉడుకుతున్న బియ్యంపిండిలో వేసి మ‌రో రెండు నిమిషాలు క‌లుపాలి.
స్టెప్ 5: ఈ మిశ్రమం పూర్తిగా చ‌ల్లార‌క ముందే.. ఒక క్లాత్ పై వ‌డియాలు వేసుకొని ఎండ‌లో ఒక‌రోజు ఎండ‌బెట్టుకోవాలి.
స్టెప్ 6: ఒక‌వేళ అలా కుద‌ర‌క‌పోయినా ఫ్యాన్ కిందైనా ఆర‌బెట్టొచ్చు. ఆ త‌ర్వాత క్లాత్‌ని రివ‌ర్స్ చేసుకోని లైట్ గా నీళ్లు చ‌ల్లుకొని వ‌డియాలు తీసుకోవాలి. కావాల‌నుకున్న‌ప్పుడు వేయించుకుంటే క‌ర‌క‌ర‌లాడే వ‌డియాలు రెడీ!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Powered by WordPress