క్రిస్పీ.. క్రిస్పీగా.. రెస్టారెంట్ స్టైల్‌లో ప్రాన్స్ క‌ర్రీ!

కావాల్సిన ప‌దార్థాలు :
ప‌చ్చి రొయ్య‌లు : 250గ్రా.
ప‌సుపు : పావు టీస్పూన్
మిరియాల పొడి : అర టీస్పూన్
మైదా : ఒక టీస్పూన్
కార్న్‌ఫ్లోర్ : 2 టీస్పూన్స్
ఉల్లిపాయ : ఒక‌టి (పెద్దది)
ప‌చ్చిమిర్చి: 4
చిల్లీఫ్లెక్స్ : అర టీస్పూన్
కొత్తిమీర: ఒక క‌ట్ట‌
అజినోమోటో : పావు టీస్పూన్
నూనె, ఉప్పు :స‌రిప‌డినంత‌

త‌యారీ విధానం :

స్టెప్1: శుభ్రం చేసుకున్న రొయ్య‌లు తీసుకోని అందులో ప‌సుపు, మిరియాల పొడి, కార్న్ ఫ్లోర్, మైదా, ఉప్పు వేసుకొని క‌లుపాలి. ఒక పావు గంట అలా వ‌దిలేయాఇ. ఉల్లిపాయ, ప‌చ్చిమిర్చి స‌న్న‌గా క‌ట్ చేసుకొని ప‌క్క‌న పెట్టుకోవాలి.

స్టెప్ 2: ఒక క‌డాయి పెట్టుకొని ఫ్రై చేసుకోవాడానికి స‌రిపడా నూనె పోసుకొని బాగా వేడి అయ్యాక అన్నీ క‌లిపి పెట్టుకున్న రొయ్య‌లను వేసుకొని స‌న్నని మంట‌పై గోల్డ్ క‌ల‌ర్ వ‌చ్చే వ‌ర‌కు ఫ్రై చేసుకొని ప‌క్క‌న పెట్టుకోవాలి.

స్టెప్ 3: ఇంకో క‌డాయి పెట్టుకొని కొద్దిగా నూనె వేసుకొని క‌ట్ చేసుకున్న ఉల్లిపాయ‌, ప‌చ్చిమిర్చి వేసుకొని వేగిన త‌ర్వాత వేయించుకున్న రొయ్య‌లు వేసుకొని టాస్ చేసుకోవాలి. దీంట్లో అజినోమోటో, చిల్లీ ఫ్లెక్స్ వేసుకొని క‌లిపేయాలి. చివ‌రిగా కొత్తిమీర వేసి దించేయాలి.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Powered by WordPress