ఆర్సీబీకి మద్దతు ఇవ్వడానికి వచ్చిన బ్రిటీష్ మాజీ ప్రధాని.. తన భార్యే కారణమంటూ వెల్లడి!
మాజీ బ్రిటిష్ ప్రధాని రిషి సునక్ ఐపీఎల్ గ్రౌండ్లో తన భార్య అక్షత మూర్తితో కలిసి సందడి చేశారు. స్వతహాగా పంజాబీ సంతతికి చెందిన ఆయన తన భార్య కోసం ఆర్సీబీకి మద్దతుగా ఐపీఎల్ మ్యాచ్కి వచ్చినట్లు చెప్పారు. రిషి సునక్.. ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి, రచయిత్రి సుధా మూర్తి కుమార్తె అక్షత మూర్తిని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే! అయితే రిషి తన ప్రేమను వెల్లడించడానికి కన్నడ భాషను ఎంచుకున్నారు. అక్షతకు ఆయన కన్నడలో […]







