కావాల్సిన పదార్థాలు:
మటన్: అరకిలో
బాస్మతీ బియ్యం : రెండు కప్పులు
ఉల్లిపాయలు : రెండు పెద్దవి
టమాటాలు : రెండు
పచ్చిమిర్చి : మూడు
అల్లం వెల్లులి పేస్ట్: రెండు టీస్పూన్స్
నెయ్యి: రెండు టీస్పూన్స్
పసుపు : అర టీస్పూన్
గరం మసాలా : ఒక టీస్పూన్
పుదీనా : ఒక కట్ట
కొత్తిమీర : ఒక కట్ట
నీళ్లు : నాలుగు కప్పులు
ఉప్పు, నూనె: సరిపడినంత
తయారీ విధానం :
స్టెప్1: ముందుగా మటన్ ను శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. బియ్యం కూడా కడిగి పెట్టుకోవాలి.
స్టెప్2: ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకోవాలి. కొతిమీర, పుదీనా కూడా సన్నగా కట్ చేసి రెడీగా పెట్టుకోవాలి.
స్టెప్ 3 : స్టౌ పై కుక్కర్ పెట్టుకొని నూనె, నెయ్యి వేసి వేడి అయ్యాక కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసి వేయించుకోవాలి. ఉల్లిపాయ వేగిన తర్వాత టమాట ముక్కలు కూడా వేసి పచ్చి వాసన పొయే వరకు ఉడికించుకోవాలి.
స్టెప్4: ఇప్పుడు పసుపు, అల్లం వెల్లులి పేస్ట్, కట్ చేసుకున్న పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర, పుదీనా వేసి కలిపి మటన్ కూడా వేసి బాగా కలుపుకొని ఒక ఐదు నిమిషాల పాటు నూనెలో ఉడికించుకోవాలి.
స్టెప్5: ఇప్పుడు గరం మసాలా వేసి నిమిషం తర్వాత నీళ్లు పోసుకొని కలిపి కుక్కర్ మూత పెట్టి మూడు నుంచి నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి.
స్టెప్6: మటన్ సగానికి పైగా ఉడికిన తర్వాత కడిగి పెట్టుకున్న బియ్యంను మటన్లో వేసి కలిపి మళ్లీ మూత పెట్టుకొని రెండు నుంచి మూడు విజిల్స్ రానివ్వాలి. చివరగా కొత్తిమీరతో గార్నిష్ చేస్తే యమ్మీ పులావ్ రెడీ!