కావాల్సిన పదార్థాలు :
మరమరాలు : రెండు కప్పులు
శనగ పిండి : నాలుగు టీస్పూన్లు
బియ్యం పిండి : రెండు టీస్పూన్లు
ధనియాల పొడి : ఒక టీస్పూన్
పచ్చిమిర్చి : రెండు
ఉల్లిపాయలు : రెండు
కొత్తిమీర : ఒక కట్ట
పుదీనా : ఒక కట్ట
కారం : అర టీస్పూన్
నూనె, ఉప్పు : సరిపడినంత
తయారీ విధానం:
స్టెప్1: మరమరాలను శుభ్రంగా కడిగి నీళ్లు లేకుండా పిండి ఒక ప్లేట్ లో వేసుకోవాలి.
స్టెప్2: ఉల్లిపాయలు , పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి.
స్టెప్3: ఇప్పుడు మరమరాలలోకి కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, శనగ పిండి, బియ్యం పిండి, ధనియాల పొడి, కారం, ఉప్పు బాగా కలుపుకోవాలి. అవసరమైతే నీళ్లు పోసుకోవాలి.
స్టెప్4: ఇప్పుడు కలిపి పెట్టుకున్న మిశ్రమంను వడలలా చేసుకొని పక్కన పెట్టుకోవాలి.
స్టెప్5: స్టౌ పై ఒక కడాయి పెట్టుకొని నూనె పోసుకోవాలి. నూనె వేడి అయిన తర్వాత ఇందాక చేసి పెట్టుకున్న వడలని వేసి సన్నని మంటపై గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకొవాలి. టేస్టీ వడలు రెడీ!