షెర్రీ సింగ్ మిసెస్ యూనివర్స్ 2025 కిరీటాన్ని గెలుచుకోవడం ద్వారా భారతదేశం అంతర్జాతీయ పోటీల ప్రపంచంలో మరపురాని మైలురాయిని నమోదు చేసింది. పైగా ఒక భారతీయరాలు ప్రతిష్టాత్మక బిరుదును గెలుచుకోవడం ఇదే మొదటిసారి.
48వ ఎడిషన్ మిసెస్ యూనివర్స్ పోటీ ఫిలిప్పీన్స్లోని మనీలాలోని ఒకాడాలో జరిగింది. ప్రపంచవ్యాప్తంగా 120 మంది ప్రతినిధులు ఈ ప్రతిష్టాత్మక కిరీటం కోసం పోటీ పడ్డారు. యూఎంబీ పేజెంట్స్ ద్వారా మిసెస్ ఇండియా 2025లో విజయం సాధించిన తర్వాత భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న షెర్రీ మహిళా సాధికారత, మానసిక ఆరోగ్య అవగాహనపై శక్తివంతమైన దృష్టితో న్యాయనిర్ణేతలను ఆకట్టుకుంది. ఆమె విశ్వాసం, కరుణామయ ఉనికి ప్రేక్షకులను, ప్యానెల్ను ఆకర్షించాయి. గ్లామర్, భావోద్వేగాలతో కూడిన రాత్రి మధ్య ఆమెకు అత్యున్నత గౌరవాన్ని తెచ్చిపెట్టింది.

సాధికారత సందేశం..
ఆమె కిరీటం ధరించిన తర్వాత.. భావోద్వేగంతో షెర్రీ సింగ్ “ఈ విజయం నాది మాత్రమే కాదు, ఇది పరిమితులను దాటి కలలు కనే ధైర్యం చేసిన ప్రతి స్త్రీకి చెందినది. బలం, దయ, స్థితిస్థాపకత నిజమైన అందాన్ని నిర్వచిస్తాయని ప్రపంచానికి చూపించాలనుకున్నాను* ఇలా అన్నారు.

గొప్ప విజయం..
మిసెస్ యూనివర్స్ టైటిల్ను గెలుచుకున్న మొదటి భారతీయురాలిగా ఆమె చరిత్ర సృష్టించింది. ఇది దేశవ్యాప్తంగా జరుపుకొనే గొప్ప విజయం. 2024లో..షెర్రీ మిసెస్ భారత్ యూనివర్స్కు ప్రాతినిధ్యం వహించగా 2025లో ఆమె గర్వంగా మిసెస్ ఇండియా యూనివర్స్కు ప్రాతినిధ్యం వహించింది. పోటీలలో తన నిరంతర అంకితభావం, నైపుణ్యాన్ని ప్రదర్శించింది. షెర్రీకి సోషల్ మీడియాలో 19,000 మంది అనుచరులు ఉన్నారు. ఆమె తన జీవితంలోని కొన్ని క్షణాలను, జిమ్ దినచర్యల నుంచి సన్నిహిత కుటుంబ క్షణాల వరకు సోషల్ మీడియాలో పంచుకుంటుంది. షెర్రీ.. సికందర్ సింగ్ను వివాహం చేసుకొని 9 సంవత్సరాలు అయింది. ఆమెకు ఒక కొడుకు ఉన్నాడు.
షెర్రీ సింగ్ విజయం, పట్టుదల, ప్రతిభ, అడ్డంకులను బద్దలు కొట్టడానికి నిదర్శనం. షెర్రీ.. భారతదేశంలోని మహిళలనే కాదు, ప్రపంచవ్యాప్తంగా మహిళలకు స్ఫూర్తినిస్తుంది.
