కావాల్సిన పదార్థాలు:
సొరకాయ తురుము : రెండు కప్పులు
బియ్యం పిండి : రెండు కప్పులు
శనగ పప్పు: అర కప్పు
పల్లీలు: పావు కప్పు
నువ్వులు : పావు కప్పు
జీలకర్ర: ఒక టీ స్పూన్
వెల్లులి: పది రెబ్బలు
పచ్చిమిర్చి: పది
ఉల్లిపాయ :ఒకటి
కరివేపాకు: రెండు రెమ్మలు
ఉప్పు, నూనె: సరిపడినంత
తయారీ విధానం:
స్టెప్1: ముందుగా సొరకాయ తురుమును ఒక గిన్నెలోకి తీసుకోవాలి. పచ్చిమిర్చి, వెల్లులి మిక్సీ పట్టి పెట్టుకోవాలి. ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకోవాలి.
స్టెప్2: స్టౌపై ఒక పాన్ పెట్టుకొని వేడి అయ్యాక పల్లీలు వేసి వేయించి పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి.
స్టెప్3: ఇప్పుడు ముందుగా వేసుకున్న సొరకాయ తురుములో, బియ్యంపిండి, పచ్చిమిర్చి మిశ్రమం, జీలకర్ర, నువ్వులు, శనగ పప్పు, పల్లీలు, కట్ చేసుకున్న ఉల్లిపాయలు, కరివేపాకు వేసుకొని బాగా కలుపుకొని అవసరాన్ని బట్టి కొన్ని కొన్ని నీళ్లు పోసుకొని చపాతీ పిండిలా కలుపుకోవాలి.
స్టెప్4: ఇప్పుడు కలిపి పెట్టకున్న మిశ్రమంను చిన్న చిన్న వుండలుగా చేసుకొని పూరిలలా ఒత్తుకొని పక్కన పెట్టుకోవాలి.
స్టెప్5: స్టౌ పై ఒక కడాయి పెట్టకొని నూనె పోసి వేడి అయిన తర్వాత ముందుగా చేసి పెట్టుకున్న గారెలను వేసి గోల్డ్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి. వీటిని అలాగే వేడిగా తింటే యమ టేస్టీగా ఉంటాయి.