కరివేపాక్.. కరివే భారత్, తమలపాక్.. తమలభారత్, మైసూర్పాక్.. మైసూర్భారత్ అంటూ సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ అవుతున్న విషయం అందరికీ తెలుసు. కానీ రాజస్థాన్లోని మిఠాయి షాపు వాళ్లు మైసూర్ పాక్ని మైసూర్ శ్రీ గా మార్చి అమ్మేస్తున్నారు.
రాజస్థాన్లో మైసూర్ పాక్, మోతీ పాక్ చాలా ప్రసిద్ధమైన మిఠాయిలు. కానీ ఇప్పుడు జరుగుతున్నఇండియా-పాక్ ఉద్రిక్తతల నడుమ అక్కడ స్వీట్ షాపు వాళ్లు ఒక నిర్ణయానికి వచ్చేశారు. మోతీ పాక్ బదులు మోతీ శ్రీ అని, మైసూర్ పాక్కి బదులు మైసూర్ శ్రీ అని నామకరణం చేసి స్వీట్లు అమ్మేస్తున్నారు. పాకిస్తాన్ మీద ఉన్న వ్యతిరేక భావనను ఇలా చాటుతున్నామని చెబుతున్నారు.
ఇక్కడ కేవలం మూడు స్వీట్ల పేర్లే కాదు.. ఇంకా కొన్ని కూడా ఉన్నాయి. అవి.. ‘ఆమ్ పాక్’ అంటే ‘ఆమ్ శ్రీ’, ‘గోండ్ పాక్’ అంటే ‘గోండ్ శ్రీ, ‘స్వర్ణ్ భస్మ్ పాక్ని స్వర్ణ్ శ్రీ, ‘చండీ భస్మ్ పాక్ని.. చండీ శ్రీ అని కూడా పేరు మార్చారు. ఇది పహల్గామ్ ఉగ్రవాద దాడి, పాకిస్తాన్లోని ఉగ్రవాద లక్ష్యాలను తాకిన ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో దేశభక్తి స్ఫూర్తిని వ్యక్తీకరించడానికి ఉద్దేశించిన చర్యగా పేర్కొన్నారు.

నగరంలోని వైశాలి నగర్ ప్రాంతంలోని త్యోహార్ స్వీట్స్ యజమాని అంజలి జైన్ “రుచికరమైన వంటకాలు జాతీయ గౌరవాన్ని కూడా ప్రతిబింబించాలి. దేశభక్తి స్ఫూర్తి సరిహద్దులో మాత్రమే కాకుండా ప్రతి భారతీయ ఇల్లు, హృదయంలో ఉండాలి” అని చెప్పారు. కస్టమర్లు కూడా ఈ నిర్ణయాన్ని అభినందిస్తున్నారు. మారిన పేర్లను చూసి సంతోషంగా ఉన్నారు. పాక్ రీబ్రాండింగ్ ఉద్యమంలో చేరుతున్న నగరంలో తమ నగరం మొదట ఉండడం అందరినీ సంతోషపరుస్తున్నది. దశాబ్దాల నాటి స్వీట్ షాపులు కూడా ఈ మార్పును ఆహ్వానిస్తున్నారు.
“స్వీట్ల పేర్లను మార్చడం చిన్నదిగా అనిపించవచ్చు, కానీ ఇది శక్తివంతమైన సాంస్కృతిక ప్రతిస్పందన. యుద్ధభూమి నుంచి స్వీట్ షాప్ వరకు పౌరులు కూడా మన దళాలతో ఐక్యంగా ఉన్నారని ఇది చూపిస్తుంది. భారతదేశం మర్చిపోదు లేదా క్షమించదు అనే సందేశం స్పష్టంగా ఉంది” అని ఒక స్వీట్ షాప్ యజమాని అన్నారు.
రేఖ్తా నిఘంటువు ప్రకారం ‘పాక్’ అనే పదం మూలాలం పర్షియన్ నుంచి వచ్చింది. దీని అర్థం ‘తీపి మాంసం లేదా మిఠాయి’ అలాగే ‘స్వచ్ఛమైనది, శుభ్రమైనది, పవిత్రమైనది*గా కూడా పరిగణిస్తారు. అందుకే స్వీట్స్ చివర పాక్ అని తగిలించడం వెనుక కథ.