ఫ్యాషన్కి అడ్డాగా ఉండే మిస్ వరల్డ్ పోటీల్లో బ్యూటీలు చేనేత వస్త్రాలు ధరించారు. గౌరంగ్ షా డిజైన్ చేసిన ఈ దుస్తులతో యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప ఆలయాన్ని సందర్శించారు. మరి ఆ స్పెషల్ స్టోరీ మీకోసం..
యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప ఆలయం చెక్కిన శిల్పాల వైభవం మధ్య ప్రపంచవ్యాప్తంగా అరవై మంది అందగత్తెలు ప్రకాశవంతంగా, భక్తితో నిలబడ్డారు. వారు కేవలం పురాతన స్మారక చిహ్నాలను సందర్శించడం లేదు వారు జీవన వారసత్వంలో అలంకరించబడ్డారు. చేతితో నేసిన చీరలు, లంగా ఓణీలను ధరించిన ఈ మిస్ వరల్డ్ 2025 పోటీదారులు భారతీయ చేనేతకు రాయబారులుగా మారారు.
ఈ మరపురాని ఘట్టం చూడడానికి కారణం.. హైదరాబాద్లోని ప్రసిద్ధ డిజైనర్ గౌరంగ్ షా. భారతదేశ చేనేత వస్త్రాలను హాట్ కోచర్గా పెంచడంలో ప్రసిద్ధి చెందారు. తెలంగాణ సాంస్కృతిక పర్యటన కోసం 60 మంది అంతర్జాతీయ ప్రతినిధులను స్టైలింగ్ చేసే బాధ్యతను షా తీసుకున్నారు. నేత, రంగులతో సుందరంగా తీర్చిదిద్దారు. ” ప్రపంచ వేదికపై భారతీయ చేనేత వస్త్రాలను ప్రదర్శించడం, మన వారసత్వానికి సంబంధించిన సజీవ మ్యూజియంలుగా ఉన్న ప్రదేశాలలో దీన్ని చేయడం చాలా భావోద్వేగంగా ఉంది” అని షా చెప్పారు.

డిజైనర్ ఈ డిజైన్ల కోసం వివిధ ప్రాంతాల్లోని గొప్ప వస్త్ర సంప్రదాయాలను ఎంచుకున్నారు. జరీ సరిహద్దుల కోసం గద్వాల్ను, దాని స్పష్టమైన చెక్కుల కోసం నారాయణపేటను, బోల్డ్ జ్యామితీయాలు, హిప్నోటిక్ రంగులకు ప్రసిద్ధి చెందిన సింగిల్, డబుల్ రెండింటికీ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన పోచంపల్లి ఇక్కత్లను ఎంచుకున్నారు. రామప్ప వద్ద వారు పట్టు, పత్తి, టస్సర్, మట్కా, ముగాల మిశ్రమం నుంచి రూపొందించిన లంగా ఓణీలను ధరించారు. కొందరు ప్రకాశవంతమైన చందేరిని ధరించారు. మరికొందరు ఆర్గాంజాలో కనిపించారు. ప్రతీ వస్త్రం కూడా భారతదేశ నేత కార్మికుల సమిష్టి మేధాస్సును ప్రతిధ్వనిస్తాయి.
“నేను ఎంచుకున్న ప్రతి వస్త్రం ఒక కథను కలిగి ఉంది. ప్రతి నేత, మూలాంశం ఈ భూమి పైన ఆధ్యాత్మిక, సాంస్కృతిక మూలాలను ప్రతిబింబించేలా ఎంపిక చేయబడింది* ” అని షా వివరించాడు. వేగవంతమైన ఫ్యాషన్ ఆధిపత్యం చెలాయించే యుగంలో షా ప్రపంచ వేడుకలో చేనేత వస్త్రాలను ధరింపచేయడం మంచి ఆలోచన.
ఓపెనింగ్లో నందినీ గుప్తా..
హైదరాబాద్లో జరిగిన 72వ మిస్ వరల్డ్ పోటీల గ్రాండ్ ఓపెనింగ్లో అందరి దృష్టి నందినీ గుప్తా మీదే ఉన్నది. దీనికి కారణం కూడా గౌరంగ్ షానే. ఆయన నందినీకి కూడా చేనేత వస్త్రాలనే డిజైన్ చేశాడు. ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రకు చెందిన జమ్దానీతో ఈ డ్రెస్ డిజైన్ చేశారు. చర్ఖాతో వడికిన ఖాదీ నూలుతో ఎంతో జాగ్రత్తగా ఈ లెహంగాని తయారు చేశారు. బంగారు జరీ, లెహరియా మోటిఫ్లతో అందరి దృష్టిని ఆకర్షించింది. మహారాష్ట్ర కళా వారసత్వంగా ఉన్న ఈ డ్రెస్ కోసం మూడు సంవత్సరాలు, ఎనిమిది మంది కళాకారులు పనిచేశారు. నందినీ కోసం షా మరిన్ని డ్రెస్లను డిజైన్ చేసినట్లు చెబుతున్నారు. ఇలా మన చేనేత వస్త్రాలను ప్రపంచ వేదిక ముందు ప్రదర్శించడం ఎంతో ఆనందంగా ఉందంటున్నాడు షా.
