కావాల్సిన పదార్థాలు:
బాస్మతీ బియ్యం : ఒక గ్లాస్
లవంగాలు : 5
యాలకులు : 3
షాజీరా : అర టీస్పూన్
అల్లం వెల్లులి పేస్ట్: ఒక టీస్పూన్
పచ్చిమిర్చి : 4
దాల్చిన చెక్క : ఒక ఇంచు ముక్క
కోడిగుడ్లు : 5
ఉల్లిపాయలు : 5 (చిన్నవి)
టమాటలు : 2
పసుపు : ఒక టీస్పూన్
కారం : ఒక టీస్పూన్
గరం మసాలా : ఒక టీస్పూన్
నెయ్యి: ఒక టీస్పూన్
కొత్తిమీర: ఒక కట్ట
పుదీనా: ఒక కట్ట
ఉప్పు, నూనె : తగినంత
తయారీ విధానం :
స్టెప్1: ముందుగా కోడిగుడ్లు ఉడికించి పొట్టు తీసి గాట్లు పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఉల్లిపాయలు పొడవుగా కట్ చేయాలి. టమాటాలు, పచ్చిమిర్చి కూడా కట్ చేయాలి.
స్టెప్2: ఇప్పుడు ఒక గిన్నెలో బాస్మతీ బియ్యం కడిగి పక్కన పెట్టుకోవాలి. కొత్తిమీర, పుదీనా కట్ చేసుకోవాలి.
స్టెప్3: ఇప్పుడు స్టౌపై ఒక గిన్నె పెట్టుకొని అందులో నూనె పోసి వేడి అయిన తర్వాత కట్ చేసుకున్న మూడు ఉల్లిపాయ ముక్కలు వేసి గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించాలి. మిగిలిన నూనెలో కోడిగుడ్లను వేసి కొద్దిగా కారం, ఉప్పు వేసి లైట్ గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి.
స్టెప్4: అదే గిన్నెలో నెయ్యి, ఒక టీ స్పూన్ నూనె వేసి లవంగాలు, షాజీరా, యాలకులు, దాల్చిన చెక్క వేసిన ఒక నిమిషం తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిర్చి, మిగిలిన ఉల్లిపాయలు వేసి వేగిన తర్వాత అల్లం వెల్లులి పేస్ట్, పసుపు, కారం, ఉప్పు, గరం మసాలా వేసి కలుపుకొని రెండు నిమిషాల తర్వాత టమాట ముక్కలు వేసి ఉడికించుకోవాలి.
స్టెప్ 5: ఇప్పుడు ఇందులో గ్లాసున్నర నీళ్లు పోసి మూత పెట్టి మరిగించుకొవాలి. మరుగుతున్న నీళ్లలో కడిగి పెట్టుకున్న బాస్మతి బియ్యం వేసుకొని కలుపుకోవాలి.
స్టెప్ 6: అన్నం 80% ఐన తర్వాత వేయించి పక్కన పెట్టకున్న ఎగ్స్, వేయించుకున్న ఉల్లిపాయలు, కొత్తిమీర, పుదీనా వేసి కలుపుకొని సన్నని మంటపై 10 నుండి 15 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకుంటే సరిపోతుంది. టేస్టీ పులావ్ మీ ముందుంటుంది.