కావాల్సిన పదార్థాలు :
మటన్ కొవ్వు : 500 గ్రా||
ఉల్లిపాయ :1
టమాటలు : 3
చింతపండు : నిమ్మకాయంత
లవంగాలు : 5
కారం : 2 టీస్పూన్స్
పసుపు : అర టీస్పూన్
అల్లం వెల్లులి పేస్ట్: ఒక టీస్పూన్
ధనియాల పొడి : అర టీస్పూన్
జీలకర్ర మెంతుల పొడి : అర టీస్పూన్
కొత్తిమీర : ఒక కట్ట
ఉప్పు, నూనె : సరిపడినంత
తయారీ విధానం :
స్టెప్1 : మటన్ కొవ్వు శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఉల్లిపాయ, టమాటలు కట్ చేసుకోవాలి. చింతపండు నానబెట్టి పులుసు తీసి పెట్టుకోవాలి.
స్టెప్2 : స్టౌ పై ఒక గిన్నె పెట్టుకొని నూనె పోసుకొని లవంగాలు , కట్ చేసుకున్న ఉల్లిపాయ వేసి వేయించుకొవాలి. పసుపు, అల్లం వెల్లులి పేస్ట్ వేసుకొవాలి 2 నిమిషాలు కలుపాలి.
స్టెప్ 3 : ఆ తర్వాత కట్ చేసుకున్న టమాటలు , ఉప్పు వేసి మగ్గిన తర్వాత మటన్ కొవ్వు కూడా వేసుకొని కలుపుకొని మూత పెట్టాలి.
స్టెప్ 4 : ఇప్పుడు చింతపండు పులుసు పోసుకొని జీలకర్ర మెంతుల పొడి వేసి 20 నిమిషాల పాటు మరిగించుకోవాలి. చివరిగా ధనియాల పొడి, కొత్తిమీర వేసి దించుకోవాలి.