కావాల్సిన పదార్థాలు:
గోధుమ రవ్వ: ఒక కప్పు
పాలు: ఒకటిన్నర కప్పు
నీళ్లు: ఒకటిన్నర కప్పు
బెల్లం : అర కప్పు
నెయ్యి : 2 టీస్పూన్స్
బాదం : గుప్పెడు
కిస్మిస్ : గుప్పెడు
జీడిపప్పు: గుప్పెడు
యాలకుల పొడి: అర టీస్పూన్
తయారీ విధానం :
స్టెప్1 : ఒక గిన్నెలో పాలు మరిగించి పెట్టుకోవాలి. మరో గిన్నెలో నీళ్లు పోసి మరిగించుకోవాలి.
స్టెప్ 2 : మరుగుతున్న నీళ్లలో గోధుమ రవ్వ వేసి ఉడికించుకొవాలి . ఇంకో కడాయి పెట్టుకొని నెయ్యి వేసి అందులో బాదం, కిస్మిస్, జీడిపప్పు వేయించి పక్కన పెట్టుకోవాలి.
స్టెప్ 3: బెల్లం తురుముకోవాలి. ఉడికిన గోధుమ రవ్వలో పాలు, బెల్లం తురుము వేసి కలుపుకోవాలి. బెల్లం కరిగిన తర్వాత వేయించి పెట్టుకున్న బాదం, కిస్మిస్, జీడిపప్పు, యాలకుల పొడి వేసి కలుపాలి.
స్టెప్4: సన్నని మంట మీద రెండు నిమిషాలు ఉంచి దించేయాలి. ఈ పాయసాన్ని ఆ దేవదేవుడికి నైవేద్యంగా సమర్పించి దీవెనలందుకోండి.