గారెలకు కావాల్సిన పదార్థాలు:
పచ్చి మొక్కజొన్నలు : 500 గ్రా.
ఎండు మిర్చి :10
వెల్లులి రెబ్బలు :10
ఉల్లిపాయలు : 2 పెద్దవి
జీలకర్ర: ఒక టీస్పూన్
కొత్తిమీర : ఒక కట్ట
పాలకూర: 2 కట్టలు
పుదీనా : ఒక కట్ట
కరివేపాకు : 4 రెమ్మలు
నూనె, ఉప్పు : సరిపడినంత
పాలపడియంకు..
బియ్యం : ఒక టీ గ్లాస్
బెల్లం : 250 గ్రా.
పాలు : 2 టీ గ్లాసులు
యాలకుల పొడి : ఒక టీస్పూన్
నీళ్లు : ఒక గ్లాస్
గారెలు తయారీ విధానం:
స్టెప్ 1: మొక్కజొన్నలు , ఎండుమిర్చి, వెల్లులి, జీలకర్ర, ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకొని ఒక గిన్నెలో వేసుకోవాలి. ఇందులో ఉల్లిపాయలు, కొత్తిమీర, పాలకూర, పుదీనా, కరివేపాకు సన్నగా కట్ చేసుకొని మిక్సీ పట్టుకున్న మిశ్రమంలో వేసుకొని కలుపాలి.
స్టెప్ 2: ఒక కడాయిలో గారెలు చేసుకోవాడానికి సరిపడా నూనె పోసుకొని ఒక క్లాత్ పై గారెలు చేసి నూనెలో వేసుకొని కరకరలాడేలా వేయించుకోవాలి.
పాలపడియం తయారీః
స్టెప్ 1: బియ్యం కడిగి ముందు రోజు రాత్రి నానబెట్టుకోవాలి. తర్వాత ఉదయం నానబెట్టిన బియ్యంలో సగం గ్లాస్ నీళ్లు పోసుకొని మిక్సీ పట్టుకోవాలి.
స్టెప్ 2: ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని గ్లాసు నీళ్లు పోసుకొని మరిగించుకోవాలి. ఈ మరుగుతున్న నీటిలో బెల్లం వేసుకొని బెల్లం కరిగిన తర్వాత మిక్సీ పట్టుకున్న బియ్యం పిండి మిశ్రమంను పోసి ఉండలు లేకుండా కలుపాలి.
స్టెప్ 3: ఇందులో పాలు పోసుకొని యాలకుల పొడి వేసుకోని 2 నిమిషాలు సన్నని మంట మీద ఉంచి దించేయాలి. అంతే.. వేడి వేడి గారెలు విత్ పాలపడియం తియ్య తియ్యగా కారం కారంగా మీ ముందుంటాయి.