మలయాళంలోనే కాదు.. తెలుగులోనూ మోహన్లాల్ క్రేజు మామూలుగా ఉండదు. అలాంటిది లూసిఫర్కి సీక్వెల్ సినిమా రాబోతున్నది. దాని టీజర్ న్యూయార్క్ నగరంలోని టైమ్ స్క్వేర్ దగ్గర ప్రదర్శించారు. దానిని చూడడానికి వందలాది మంది గుమిగూడారు. దానికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

మోహన్ లాల్, దర్శకుడు-నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ల L2: ఎంపురాన్ సినిమా మార్చి 27న గ్రాండ్ రిలీజ్కు సిద్ధమవుతోంది. ఈ సినిమా ట్రైలర్ లాంచ్కు ముందు న్యూయార్క్ లోని టైమ్స్ స్క్వేర్ లో ఎంపురాన్ సినిమా ప్రోమోను ప్రదర్శించారు. అత్యంత రద్దీగా ఉండే వీధిలో ఈ అద్వితీయమైన వేడుకను వీక్షించడానికి 300 మందికి పైగా ప్రజలు గుమిగూడారు. చాలామంది ఈ టీజర్ని వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.
న్యూయార్క్ లో జరిగిన ఎంపురాన్ వేడుకకు సంబంధించిన ఫోటోలు, విజువల్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. మోహన్ లాల్ అభిమానులు కొంతమంది తెల్లటి చొక్కా, ధోతీ ధరించి మోహన్లాల్ ఫేస్ మాస్క్లతో కనిపించారు. మరో వీడియోలో మోహన్ లాల్ పాత్రను రివీల్ చేసే వీడియో టైమ్స్ స్క్వేర్ లో ప్రదర్శించినప్పుడు అభిమానులు అరుస్తూ కనిపించారు. ఇక మోహన్ లాల్ పేరు తెరపై కనిపించినప్పుడు చాలా మంది తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఈలలు కొట్టారు.
ఇటీవల ఎంపురాన్ చిత్ర బృందం ఎటువంటి ప్రమోషన్లలో పాల్గొనలేదు. అలాగే ట్రైలర్ విడుదల చేయకపోవడంతో సినిమా వాయిదా వేయవచ్చని పుకార్లు వచ్చాయి. లైకా ప్రొడక్షన్స్ కూడా ఈ చిత్రం నుంచి తప్పుకున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే మార్చి 16న మోహన్లాల్ ఒక ప్రకటన చేస్తూ మార్చి 27న ఈ సినిమా విడుదల అవుతున్నట్లు ప్రకటించారు.