కావాల్సిన పదార్థాలుః
బాదం : ఒక టీస్పూన్
పిస్తా : ఒక టీస్పూన్
జీడిపప్పు : ఒక టీస్పూన్
ఐస్ క్రీమ్ : 2 స్కూప్స్
పాలు : అర లీటరు
సబ్జా గింజలు :2 టేబుల్ స్పూన్స్
సేమియా : అర కప్పు
రోజ్ సిరప్ :2 టేబుల్ స్పూన్స్
చక్కెర :2 టేబుల్ స్పూన్స్
అరటి ,ఆపిల్, ద్రాక్షః మనకు నచ్చినన్ని
టూటీ ఫ్రూటీ : 2 టేబుల్ స్పూన్స్
తయారీ విధానం :
స్టెప్ 1: ముందుగా సబ్జా గింజలను నీటిలో నానబెట్టాలి
స్టెప్ 2: సేమియాను ఉడికించి పెట్టుకోవాలి. అలాగే పాలను చిక్కగా మరిగించి చల్లార్చుకోవాలి.
స్టెప్ 3: ఇప్పుడు చల్లారిన పాలలో రోజ్ సిరప్, చక్కెర వేసి కలుపుకోవాలి.
స్టెప్ 4: ఒక గిన్నెలో ముందుగా ఉడికించిన సేమియా వేసుకోవాలి. తర్వాత అందులో నానబెట్టిన సబ్జా గింజలు, రోజ్ మిల్క్ వేయాలి. పైన ఐస్ క్రీం వేసుకోవాలి.
స్టెప్ 5: చివరిగా బాదం, పిస్తా, జీడిపప్పు, అరటి, ఆపిల్, ద్రాక్ష పండ్లు కట్ చేసి వేయాలి. టూటీ ఫ్రూటీ తో గార్నిష్ చేసుకుంటే టేస్టీ ఫలుదా రెడీ!