కావాల్సినవిః
మైసూర్ పప్పుః ఒక కప్పు
క్యారెట్ః ఒక కప్పు
టమాటః 1(చిన్నది)
సేమియాః రెండు టేబుల్స్పూన్స్
ఉప్పు, నూనెః తగినంత
తయారీః
స్టెప్ 1ః మిక్సీ జార్లో మైసూర్ పప్పు వేసి పెట్టుకోవాలి.
స్టెప్ 2ః క్యారెట్ని చెక్కు తీసి చిన్నముక్కలుగా కట్ చేయాలి. అలాగే టమాటాను కూడా నాలుగు ముక్కలుగా కట్ చేయాలి.
స్టెప్ 3ః వీటిని కూడా మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇందులో సేమియా కూడా వేసి కొన్ని నీళ్లు పోసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి.
స్టెప్ 4ః దీన్ని ఒక గిన్నెలోకి తీసుకొని ఉప్పు వేసి కలిపి వెంటనే దోశలు పోసుకోవచ్చు. ఈ దోశలను పల్లీ చట్నీ లేదా టమాటా చట్నీతో లాగించేయొచ్చు.