బాలీవుడ్లోనే కాదు.. తెలుగులోనూ సూపర్ సక్సెస్ హీరోయిన్గా పేరు సంపాదించింది కియారా. ఆమె తన భర్త సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి సోషల్ మీడియాలో తల్లికాబోతున్నట్లు ప్రకటించింది.
కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రా సక్సెస్ఫుల్ నటీనటులు. జీవితంలోనూ పెండ్లి బంధంతో రెండు సంవత్సరాల క్రితం ఒక్కటయ్యారు. ఇప్పుడు మొదటి బిడ్డను కనబోతున్నట్లు ప్రకటించారు. తమ జీవితంలో వచ్చే పెద్ద బహుమతిని త్వరలో అందుకోబోతున్నామంటూ సోషల్ మీడియాలో ఒక చిన్న సాక్స్లు పెట్టి క్యాప్షన్ రాసుకొచ్చారు.
ప్రేమను ఇలా..

ఫిబ్రవరి 7న రెండు సంవత్సరాల వైవాహిక జీవితం పూర్తి చేసుకున్నారీ దంపతులు. ఈ సందర్భంగా కియారా ఒక ఫన్నీ వీడియోని షేర్ చేశారు. తమ పెండ్లిలో జరిగిన ఒక సంఘటనను జతచేస్తూ ఈ వీడియోని క్రియేట్ చేశారు. అందులో పెండ్లిలో సిద్ధార్థ్ని లాగుతూ ఉన్నట్లుగా ఉంటుంది. ప్రస్తుతం తను జిమ్ చేస్తూ ఒక ట్రాలీలో అతడిని ఉంచి నిజంగానే లాగి చూపించింది.
సిద్ధార్థ్ మాత్రం కాస్త రొమాంటిక్ పోస్ట్ని షేర్ చేశాడు. పెండ్లి ఫోటోల్లో ఇప్పటివరకు పోస్ట్ చేయని రెండు ఫోటోలను షేర్ చేసి ఆమె మీద ఉన్న ప్రేమని చాటుకున్నాడు. అందులో ఒక ఫోటోలో తన చేతి మీద కె అని మెహందీ వేసుకున్న ఫోటోని చూసి అందరూ కియారా అంటే సిద్ధార్థ్కి ఎంతో ఇష్టమో అర్థమవుతుందని కామెంట్లు చేశారు.
కియారా-సిద్ధార్థ్ ఫిబ్రవరి 7, 2023న వివాహం చేసుకున్నారు. రాజస్థాన్లోని జైసల్మేర్లో జరిగిన ఈ జంట వివాహం చాలా సన్నిహితుల మధ్య జరిగింది. దీనికి కరణ్ జోహార్, షాహిద్ కపూర్, మీరా రాజ్పుత్, మనీష్ మల్హోత్రా వంటి సన్నిహితులు, ఇతర కుటుంబ సభ్యులు హాజరయ్యారు.
సినిమా..
మాడాక్ ఫిల్మ్స్ రాబోయే చిత్రంలో వీరిద్దరూ స్క్రీన్ స్పేస్ పంచుకోబోతున్నట్లు సమాచారం. కియారా ప్రస్తుతం యష్ తో కలిసి టాక్సిక్ సినిమా చేస్తోంది. హృతిక్ రోషన్ తో కలిసి వార్ 2 లో, రణవీర్ సింగ్ తో కలిసి డాన్ 3 లో కూడా కనిపించనుంది. సిద్ధార్థ్ గత సంవత్సరం తన ప్రాజెక్ట్ VVAN: ఫోర్స్ ఆఫ్ ది ఫారెస్ట్ ను ప్రకటించాడు. ఇది ఈ సంవత్సరం నవంబర్లో విడుదల కానుంది.