ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన అందాల ఉత్సవానికి హైదరాబాద్ వేదిక కానుంది. మిస్ వరల్డ్ 72వ ఎడిషన్కి తెలంగాణ ఆతిథ్యం ఇవ్వబోతున్నది.

2025లో తెలంగాణ సగర్వంగా మిస్ వరల్డ్ అందాల పోటీని నిర్వహిస్తున్నది. చారిత్రాక వారసత్వ సంపదను ప్రపంచానికి చాటడానికి ఇదొక గొప్ప వేదిక కాబోతున్నది. ఈ ఉత్సవం మే 7 నుంచి మే 31 వరకు 4 వారాల పాటు కొనసాగుతుంది. ప్రారంభ, ముగింపు వేడుకలు కూడా హైదరాబాద్లో జరుగనున్నాయి.

అనువైన స్థలం..
న్యూఢిల్లీ, మహారాష్ట్రలోని ముంబైలలో జరిగిన 71వ మిస్ వరల్డ్ ఘన విజయం తర్వాత మిస్ వరల్డ్ ఇప్పుడు తెలంగాణకు తరలివచ్చింది. భారతదేశంలో అతి చిన్న రాష్ట్రమైన తెలంగాణ ఆవిర్భవించిన మొదటి దశాబ్దంలోనే వేగవంతమైన పురోగతిని సాధించింది. నేడు దాని బలమైన మౌలిక సదుపాయాలు, అద్భుతమైన కనెక్టివిటీకి ప్రత్యేకంగా నిలుస్తుంది. ప్రపంచంలోని అత్యుత్తమ విమానాశ్రయాలలో ఒకటి హైదరాబాద్లో ఉంది. ఏడాది పొడవునా ఆహ్లాదకరమైన వాతావరణం, ప్రతిష్టాత్మక విద్యా సంస్థలు, అభివృద్ధి చెందుతున్న ఐటీ ఆధారిత సేవల రంగం, భారీ ఆరోగ్య మౌలిక సదుపాయాలతో కూడిన ప్రపంచ ఔషధ కేంద్రం, చలనచిత్ర పరిశ్రమను హైదరాబాద్ కలిగి ఉంది. హైదరాబాద్.. భద్రత, పర్యాటక అనుకూలతకు దాని ఖ్యాతి, అభివృద్ధి చెందుతున్న అంతర్జాతీయ పర్యావరణ వ్యవస్థ, భారతదేశమే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పర్యాటకులకు అనువైన గమ్యస్థానంగా నిలిచింది.
పోటీలు ఇలా..
ప్రతిష్టాత్మకమైన ఈ మిస్ వరల్డ్ ఫెస్టివల్లో 120 కి పైగా దేశాల నుంచి సుందరీమణులు ర్యాంప్ మీద నడువబోతున్నారు. ఈసారి మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ బ్యూటీ విత్ ఎ పర్పస్ అనే లక్ష్యంతో ఈ అందాల పోటీని నిర్వహించబోతున్నారు. దేశ, విదేశ ప్రతినిధులకు తెలంగాణ ప్రభుత్వం ఆహ్వానం పలుకుతున్నది. ఈ అధికారిక ప్రకటనను మిస్ వరల్డ్ లిమిటెడ్ ఛైర్మన్, సీఈవో జూలియా మోర్లీ CBE, తెలంగాణ ప్రభుత్వ పర్యాటక, సంస్కృతి, వారసత్వ, యువజన వ్యవహారాల శాఖ కార్యదర్శి శ్రీమతి స్మితా సభర్వాల్ తో కలిసి చేశారు.

తెలంగాణ ప్రభుత్వం..
తెలంగాణ జరూర్ ఆన పేరుతో ఇప్పటికే తెలంగాణ టూరిజం శాఖ దేశ విదేశాల నుంచి పర్యాటకులను ఆహ్వానిస్తున్నది. ఇప్పుడుఈ వేదిక తెలంగాణ చేనేత వారసత్వం, అద్భుతమైన గమ్యస్థానాలు, రుచికరమైన వంటకాలు, కళారూపాలు, చేతిపనులను ఈ పోటీల్లో ప్రదర్శించనున్నట్లు స్మితసభర్వాల్ ప్రకటించారు.