ఇలా చేయండి మ‌ష్రూమ్‌ని లొట్ట‌లేసుకంటూ తింటారు!

కావాల్సిన‌వి :

మ‌ష్రూమ్ : 250 గ్రా.

జీడిప‌ప్పు : 10

ట‌మాటాలు : 2

ఉల్లిగ‌డ్డ : 1

అల్లం, వెల్లుల్లి పేస్ట్ : అర టీస్పూన్‌

ల‌వంగాలు : 4

దాల్చిన‌చెక్క : చిన్న ముక్క‌

యాల‌కులు : 2

పెరుగు : రెండు టేబుల్‌స్పూన్స్‌

బ‌ట‌ర్ : రెండు టేబుల్‌స్పూన్స్‌

క‌స్తూరీమేతీ : అర‌ టీస్పూన్

కారం : అర టీస్పూన్

ప‌సుపు : చిటికెడు

ధనియాల పొడి : పావు టీస్పూన్

నూనె, ఉప్పు : త‌గినంత

త‌యారీ :

స్టెప్ 1ః మ‌ష్రూమ్ పైన లేయ‌ర్ తీసి క‌డిగి చిన్న ముక్క‌లుగా క‌ట్ చేసి పెట్టుకోవాలి.

స్టెప్ 2ః మిక్సీ జార్‌లో ట‌మాటా ముక్క‌లు, జీడిప‌ప్పు, పెర‌గు, ల‌వంగాలు, దాల్చిన‌చెక్క‌, యాల‌కులు వేసి మెత్త‌టి పేస్ట్ చేసి పెట్టుకోవాలి.

స్టెప్ 3ః ఇప్పుడు పెద్ద క‌డాయి పెట్టి బ‌ట‌ర్ వేసి మ‌ష్రూమ్‌ని ఐదు నిమిషాల పాటు ప‌సుపు వేసి ఉడికించాలి. ఇది ఉడికించేట‌ప్పుడు నీళ్లు వ‌స్తాయి. వాటితో స‌హా మ‌ష్రూమ్‌ని మ‌రొక గిన్నెలో తీసుకోవాలి.

స్టెప్ 4ః అదే క‌డాయిలో నూనె పోసి ఉల్లిపాయ ముక్క‌లు వేసి అల్లం, వెల్లుల్లి పేస్ట్ వేసి వేగ‌నివ్వాలి.

స్టెప్ 5ః ఇందులో ట‌మాటా పేస్ట్ వేసి క‌లుపుతుండాలి. కాస్త నూనె పైకి తేలాక ఉప్పు, కారం వేసి క‌లుపాలి.

స్టెప్ 6ః రెండు నిమిషాల త‌ర్వాత ముందు వేయించుకున్న మ‌ష్రూమ్ ని వేసి మూత పెట్టేయాలి. మ‌రో ఐదు నిమిషాలు అలాగే ఉంచాలి.

స్టెప్ 7ః ఇక్క‌డ అవ‌స‌ర‌మైన కొన్ని నీళ్లు పోసి మ‌రికొద్ది సేపు మూత పెట్టి ఉంచాలి. మ‌ష్రూమ్‌ ఉడికిన త‌ర్వాత చివ‌ర‌గా క‌స్తూరీ మేతీ వేసి క‌లిపి దించేయాలి.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Powered by WordPress