
కావాల్సిన పదార్థాలు :
పప్పు – ఒక కప్పు
మెంతికూర – ఒక కట్ట
చింతపండు – నిమ్మకాయ అంత
పచ్చిమిర్చి – 4
టమాట – 1
కరివేపాకు – ఒక రెమ్మ
ఆవాలు – అర టీస్పూన్
జీలకర్ర – అర టీస్పూన్
ఉల్లిగడ్డ – 1 (చిన్నది)
కస్తూరీమేతీ – పావు టీస్పూన్
ఎండుమిర్చి – 2
వెల్లుల్లిపాయలు – 4 రెబ్బలు
కారం – అర టీస్పూన్
ఉప్పు, నూనె – తగినంత
తయారీ విధానం :
స్టెప్ 1ః పప్పును వేరుగా, చింతపండును వేరు వేరు గిన్నెలో వేసి నీళ్లు పోసి ఒక గంటపాటు నానబెట్టాలి.
స్టెప్ 2ః మెంతికూర కడిగి చిన్నగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ పెట్టి కొద్దిగా నూనె పోసి ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి.
స్టెప్ 3ః ఉల్లిపాయలు వేగాక మెంతికూరను వేసి పచ్చివాసన పోయేవరకు వేయించాలి. దీంట్లో టమాట ముక్కలు, పప్పు వేసి కలుపాలి.
స్టెప్ 4ః ఇందులో ఉప్పు, కారం వేసి రెండు నిమిషాలు ఆగి చింత పండు రసం వేసి కొన్ని నీళ్లు పోసి కుక్కర్ మూత పెట్టేయండి.
స్టెప్ 5ః నాలుగు విజిల్స్ వచ్చాక మూత తీసి ఉప్పు సరిచూసుకోండి.
స్టెప్ 6ః ఆ తర్వాత చిన్న కడాయి పెట్టి నూనె కాగాక.. ఆవాలు. జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు, కరివేపాకు, కస్తూరీ మేతీ వేసి పోపు పెట్టుకోవాలి. పోపును పప్పులో వేసి కలుపుకోవాలి. అంటే టేస్టీ మెంతికూర పప్పు రెడీ!