ఉపావాస దీక్ష స‌మ‌యంలో అల్పాహారం స‌గ్గుబియ్యం కిచిడీ!

ఉప‌వాసం స‌మ‌యంలో ఏదైనా అల్పాహారం తీసుకుంటుంటారు కొంద‌రు. అలాంటి వారికి టేస్టీ స‌గ్గుబియ్యం కిచిడీ ఎలా త‌యారు చేయాలో తెలుసుకోండి.

స‌గ్గుబియ్యంతో కేవ‌లం జావా, పాయ‌స‌మే కాదు.. రుచిక‌ర‌మైన కిచిడీ కూడా చేసుకోవ‌చ్చు. పైగా  ఈ అల్పాహారం మీకు తేలిక‌గా జీర్ణ‌మ‌వుతుంది. కార్బొహైడ్రేట్స్ త‌క్కువ‌గా ఉండే ఇది కేవ‌లం ఉప‌వాస స‌మ‌యంలోనే కాదు.. బ‌రువు త‌గ్గాల‌నుకునేవారికి కూడా మంచి ఆహారం. కాబ‌ట్టి ఒక‌సారి దానికి కావాల్సిన‌వి, త‌యారీ విధానం ఏంటో ఒక లుక్కేయండి.

కావాల్సిన ప‌దార్థాలు :

స‌గ్గుబియ్యం : ఒక క‌ప్పు

ప‌ల్లీలు :  పావు క‌ప్పు

ఆలుగ‌డ్డ : 1

క‌రివేపాకు : ఒక రెమ్మ

నూనె : ఒక టేబుల్ స్పూన్

జీల‌క‌ర్ర : పావు టీస్పూన్

ప‌చ్చిమిర్చి : 4

ఉప్పు : త‌గినంత

త‌యారీ విధానం :

స్టెప్ 1 : స‌గ్గు బియ్యం క‌డిగి క‌నీసం రెండు గంట‌ల పాటు నాన‌బెట్టాలి.

స్టెప్ 2 : ఆలుగ‌డ్డ‌ను ఉడికించి చిన్న ముక్క‌లుగా క‌ట్ చేసి పెట్టుకోవాలి.

స్టెప్ 3 : ఇప్పుడు నాన‌బెట్టిన స‌గ్గుబియ్యాన్ని ఒక జ‌ల్లెడ‌లో వేసి నీళ్లు మొత్తం వ‌డ‌క‌ట్టాలి.

స్టెప్ 4 : ఆ త‌ర్వాత క‌డాయిలో ప‌ల్లీలు వేసి వేయించాలి. అందులో కొన్ని ప‌ల్లీల‌ను ప‌క్క‌న పెట్టి మిగిలిన ప‌ల్లీల‌ను పొడి చేసుకోవాలి.

స్టెప్ 5 : పెద్ద గిన్నెలో నూనె పోసి వేడ‌య్యాక జీల‌క‌ర్ర‌, క‌రివేపాకు, ప‌చ్చిమిర్చి వేసి వేయించాలి.  ఇందులోనే వేయించుకున్న ప‌ల్లీలు వేసి కాసేపు వేగ‌నివ్వాలి.

స్టెప్ 6 : ఇందులో వ‌డ‌క‌ట్టిన స‌గ్గుబియ్యం వేసి ఒక‌సారి క‌లుపాలి. ఇప్పుడు ఉప్పు, ప‌ల్లీల పొడి వేసి బాగా క‌లుపాలి. ప‌చ్చి వాస‌న పోయాక స్ట‌వ్ ఆపేస్తే స‌రిపోతుంది. టేస్టీ స‌గ్గుబియ్యం కిచిడీ రెడీ!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Powered by WordPress